ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీకీ షాక్ - అదనపు కార్యదర్శి రఘురామయ్య రాజీనామా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 3:59 PM IST

Cherukucherla Raghuramaiah Resigns to YSRCP : నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్సార్సీపీకీ భారీ షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య ఆ పార్టీకీ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మిత్రుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌కు ముఖ్యమంత్రి జగన్ టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. సర్వే రిపోర్ట్‌లు అన్ని బాగున్నా ఆర్ధర్‌కు టికెట్ నిరాకరించారు. జగన్ దళిత ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ చేసి వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. దళితును మోసం చేస్తున్న జగన్ అంబెేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రయోజనం ఏంటని? ప్రశ్నించారు. 

ప్రస్తుతం రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని నేనే వైసీపీలో చేర్చాను. కానీ నాకే పార్టీలో సరైన గుర్తింపు లేదని తెలిపారు. ఇక నుంచి ఎమ్మెల్యే ఆర్థర్‌తో కలిసి నడవను, టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉండొచ్చు అంటూ చెరకుచెర్ల రాఘురామయ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైందని, అలాగే నకిలీ మద్యం వల్ల ఎందరో మరణించారని గుర్తు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details