తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాజ్​భవన్​లో ఘనంగా సాగిన బతుకమ్మ సంబురాలు

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Bathukamma Celebrations At Raj Bhavan : రాజ్‌భవన్‌లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, ఆయన సతీమణి సుధాదేవ్​ వర్మ పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. సీఎస్​ శాంతి కుమారి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు గవర్నర్ దంపతులు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుధా దేవ్ వర్మ బతుకమ్మ సంబరాలలో రాజ్​భవన్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆచారవ్యవహారాలను అనుసరించారు. బతుకమ్మను తీసుకుని రాజ్ భవన్ ప్రధాన భవనం ఎదుట ఉన్న ఆవరణలోకి వచ్చిన ఆమె అక్కడే రాజ్​భవన్ సిబ్బంది కుటుంబాలతో కలిసి ఆడిపాడారు. 

మరోవైపు సద్దుల బతుకమ్మ వేడుకలను ఈ నెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details