తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇకపై మొబైల్ నంబర్ పోర్టింగ్​కు 7 రోజులు ఆగాల్సిందే - ట్రాయ్​ నయా రూల్- స్కామ్స్​ అరికట్టేందుకే!

Mobile Number Portability Rules : టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) మొబైల్​ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం, ఇకపై మొబైల్ నంబర్​ పోర్టింగ్​ కోసం కనీసం 7 రోజులు ఆగాల్సి ఉంటుంది. సిమ్​ స్వాప్​ స్కామ్స్​ నుంచి యూజర్లను ప్రొటక్ట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ స్పష్టం చేసింది.

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:59 PM IST

TRAI Tightens Mobile Number Portability Rules
Mobile Number Portability Rules 2024

Mobile Number Portability Rules :పెరుగుతున్న ఆన్​లైన్​ స్కామ్​లను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రూల్స్​ను మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం, కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నవాళ్లు, తమ నంబర్​ను వేరే టెలికాం ఆపరేటర్​కు మార్చాలని అనుకునేవాళ్లు, కనీసం 7 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది.

వరుసగా తొమ్మిదో సారి!
ట్రాయ్ మొదటిసారిగా 2009లో​ మొబైల్​ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలకు తీసుకువచ్చింది. తరువాత ఆ రూల్స్​ను పలుమార్లు సవరించింది. తాజా తొమ్మిదోసారి ఎమ్​ఎన్​పీ రూల్స్​ను ఛేంజ్ చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, మీ సిమ్ కార్డు పోయినా, డ్యామేజ్ అయినా లేదా దానిని అప్​గ్రేడ్ చేయాలని అనుకున్నా, సదరు మొబైల్​ నంబర్​ పోర్టబిలిటీ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు కొత్త సర్వీస్​ ప్రొవైడర్​కు మారేందుకు కనీసం ఒక వారం రోజుల పాటు వేచిచూడాల్సి ఉంటుంది.

మన పాత సిమ్ కార్డ్ నంబర్​ పోకుండా, మరొక మంచి నెట్​వర్క్​కు మారడానికి ఈ పోర్టబిలిటీ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీకు నచ్చిన నెట్​వర్క్​కు మీ మొబైల్ నంబర్​ను పోర్ట్ చేసుకోవచ్చు.

సైబర్ మోసాలను అరికట్టేందుకే!
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సిమ్ స్వాప్ విధానం ద్వారా సాధారణ ప్రజల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు హైజాక్ చేస్తున్నారు. వాటిని తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారు. అందుకే ఈ ఆన్​లైన్ ఫ్రాడ్​స్టర్స్​కు చెక్​ పెట్టేందుకు ట్రాయ్​ ఈ మొబైల్ పోర్టబిలిటీ రూల్స్​ను కఠినతరం చేసింది. సిమ్ పోర్టబిలిటీకి 7 రోజుల వెయిటింగ్ పీరియడ్​ను తప్పనిసరి చేసింది. దీని వల్ల యూజర్లకు తెలియకుండా, వారి నంబర్​లను స్కామర్లు వేరే నెట్​వర్క్​లకు బదిలీ చేయలేరు. అంటే స్కామర్ల బారి నుంచి యూజర్లు సురక్షితంగా ఉండేందుకు ఈ నయా రూల్స్ ఉపయోగపడతాయని ట్రాయ్​ భావిస్తోంది.

ఇకపై వాట్సాప్‌ పేమెంట్స్‌ మరింత ఈజీ - చాట్‌ లిస్ట్‌లోనే QR కోడ్​!

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్​ బైక్స్ ​& స్కూటీస్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details