తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ అభిమానులకు కొదవలేదు : సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH AT YSR Birth Anniversary

YS Rajasekhara Reddy Birth Anniversary : ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని మరిచిపోలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే వైఎస్‌ గుర్తుకువస్తారని, తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ అభిమానులకు కొదవలేదని కొనియాడారు. వైఎస్‌ను తాము కుటుంబసభ్యుడిలా భావిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 8:30 PM IST

Updated : Jul 8, 2024, 9:38 PM IST

YS Rajasekhara Reddy Birth Anniversary
CM Revanth Join in YS Rajasekhara Reddy Birth Anniversary (ETV Bharat)

CM Revanth Join in YS Rajasekhara Reddy Birth Anniversary :తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ అభిమానులకు కొదవలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ను తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి, 2007లో వైఎస్ ముందు అనేక విషయాలు ప్రస్తావించానని గుర్తు చేసుకున్నారు.

మండలిలో మాట్లాడినప్పుడు వైఎస్‌ తనను ప్రోత్సహించేవారన్నారు. కొత్త సభ్యుల మాటలు కూడా వినాలని వైఎస్ చెప్పేవారని, ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఉదారంగా ఉండేవారని కొనియాడారు. కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ ప్రయత్నించేవారన్నారు. చేవెళ్ల-ఇచ్ఛాపురం పాదయాత్రతో 2004లో వైఎస్‌ అధికారంలోకి వచ్చారన్న రేవంత్‌, ఏ పదవీ రాకున్నా కూడా వైఎస్‌ పార్టీని వదల్లేదని తెలిపారు.

ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నది షర్మిలమ్మనే : ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ అలుపెరగని పోరాటం చేస్తున్నారని, 1999లో వైఎస్ పోషించిన పాత్రను షర్మిల ఇప్పుడు పోషిస్తుందని ప్రశంసించారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్న రేవంత్‌రెడ్డి, బాబు, జగన్‌, పవన్‌ అందరూ పాలకపక్షమే అని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర షర్మిల పోషిస్తున్నారని అన్నారు. వైఎస్ జయంతి సభకు వెళ్లాలని కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్‌, మల్లిఖార్జున ఖర్గే తనను కోరారన్న రేవంత్, అనివార్య కారణాల వల్ల ఖర్గే ఈ సభకు రాలేకపోయారని తెలిపారు.

"శాసనమండలి సమావేశాలు వస్తున్నాయంటే, సమస్యలను ప్రస్తావించాలని వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి దృష్టిని ఆకర్షించాలని, రాత్రంతా చదువుకొని మరీ మండలికి వెళ్లిన రోజులు ఉన్నాయి. కొత్తగా సభలోకి వచ్చే సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్లను ప్రోత్సహించాలి, తద్వారా నాయకత్వం బలపడుతుందని చెప్పి వైఎస్​ఆర్​ ఆనాడు మాట్లాడారు."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జయంతి సభ నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ జయంతిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తతితరులు పాల్గొన్నారు.

కడప నుంచే మళ్లీ పోరాటం ప్రారంభిద్దాం : 2029లో కాంగ్రెస్‌దే అధికారమని, షర్మిల సీఎం అవుతారని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్‌ ప్రధాని కావాలని వైఎస్‌ ఎప్పుడూ అనేవారన్న రేవంత్‌రెడ్డి, ఎంత కష్టమైనా షర్మిల ముళ్లబాట ఎన్నుకున్నారని తెలిపారు. నూటికి నూరుశాతం షర్మిలకు తోడుగా ఉంటామని, వైఎస్ అభిమానులకు అండగా ఉంటామని చెప్పేందుకే అందరం కలిసి వచ్చామన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే ఊరూరా తిరిగే బాధ్యత తీసుకుంటానన్న, వైఎస్‌ స్వస్థలం కడప నుంచే మళ్లీ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.

'అభివృద్ధే వైఎస్సార్ ఆశయం - రాహుల్​ను పీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యం' - CM REVANTH REDDY ABOUT YSR

వైఎస్సార్ 75వ జయంతి - ఇడుపులపాయలో వేర్వేరుగా జగన్, షర్మిల నివాళులు - YSR 75th Birth Anniversary

Last Updated : Jul 8, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details