తెలంగాణ

telangana

నేనూ రైతునే - భావోద్వేగానికి గురైన అన్నదాతను హత్తుకొని ఓదార్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ - Union Minister Shivraj on Floods

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 3:03 PM IST

Updated : Sep 6, 2024, 9:02 PM IST

Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation : ఊహించని వరదతో పంట నష్టపోయిన రైతులు, ఇళ్లు దెబ్బతిన్న ప్రజలకు బాసటగా నిలుస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ అభయమిచ్చారు . రాష్ట్రప్రభుత్వంతో కలిసి స్వల్పకాలికంగా , దీర్ఘకాలికంగా ఎలా ఆదుకోవాలో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మలతో కలిసి పర్యటించారు.

Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation in Khammam
Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation (ETV Bharat)

Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation in Khammam : ఇటీవలి వరదలు ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. మున్నేరు వరద ఉద్ధృతికి వేలాది ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం సంభవించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బండి సంజయ్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మున్నేరు, మధిరలో కట్టలేరు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాలేరు కాలువను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు పరిశీలించారు.

అనంతరం నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వర్ష బీభత్సానికి జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్​లో కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. చిత్ర ప్రదర్శన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్రమంత్రితో తమకు జరిగిన నష్టాన్ని వివరించిన అన్నదాతలు, సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురైన రైతును కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ఓదార్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

నేనూ రైతునే - కర్షకుల పరిస్థితులు బాగా తెలుసు : భారీ వరదలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని కేంద్రమంత్రి ఆరోపించారు. ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆయన, ఆ పథకం అమలులో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. కనీసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని అన్నారు.

తాను కూడా రైతునేనని, అన్నదాతల పరిస్థితి బాగా తెలుసని వివరించారు. వరదల కారణంగా వరి, ఇతర పంటల సాగులో రైతులు కోలుకోలేనంత మొత్తంలో దెబ్బతిన్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని ముఖాముఖిలో తెలిపారు. ఈ విపత్కర సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పక అండగా నిలుస్తామని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హామీ ఇచ్చారు.

"వరద ధాటికి వరి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద పొలాలను ముంచెత్తడం వల్ల వంద శాతం చేలు నాశనమయ్యాయి. రాజకీయాల కోసం కాకుండా వరద బాధితులైన ప్రజలు, రైతులను రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఆదుకునేందుకు మేం వచ్చాం. కేంద్రం ఉదారంగా సొమ్ము జమచేసిన ఎస్​డీఆర్​ఎఫ్​ నిధులను గత ప్రభుత్వం దారిమళ్లించింది. విపత్తులతో రైతులు నష్టపోతే ఇతోధికంగా ఆదుకునే ఫసల్‌ బీమా పథకంలోనూ గత ప్రభుత్వం చేరలేదు. ఫలితంగా ఆపత్కాలంలో అన్నదాతలకు బీమా దక్కలేదు. వరద బాధితులకు ఏ రీతిలో చేయూతనివ్వాలో ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో కేంద్ర పథకాలను అందిస్తాం. రాష్ట్రప్రభుత్వంతో కలిసి కేంద్రం సహాయపడుతుంది. బాధిత రైతుల్ని సంక్షోభంలో నుంచి గట్టెక్కించి వారి కన్నీరు తుడుస్తాం."-శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, కేంద్రవ్యవసాయశాఖ మంత్రి

"జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదు - ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఉన్న రూ.1,345 కోట్లను వినియోగించాలి" - Kishan Reddy On Flood Relief Fund

తెలంగాణ ప్రకృతి విపత్తుపై నివేదిక అందలేదు - సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ - UNION GOVT ON TELANGANA SDRF FUNDS

Last Updated : Sep 6, 2024, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details