తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / state

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా - హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Fires On CM Revanth

Union Minister Bandi Sanjay Comments On Hydra : తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. నిన్నామొన్నటి వరకు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్ల పరిధిలోని ఇళ్లను కూల్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట ఆ నది పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ నాయకులను దాటిన తర్వాతే కూల్చివేతల జోలికి వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Union Minister Bandi Sanjay Fires On CM Revanth Reddy
Union Minister Bandi Sanjay Comments On Hydra (ETV Bharat)

Union Minister Bandi Sanjay Fires On CM Revanth Reddy : ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ ఫొటో ఎగ్జిబిషన్​లో పాల్గొన్న బండి సంజయ్, మోదీ దేశానికి చేసిన సేవ, ఆదర్శ జీవితాన్ని తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు స్వేచ్ఛ సేవా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

తెలంగాణలో ప్రజలు హైడ్రా కూల్చివేతల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మరోవైపు గ్రామాల్లోని సర్పంచ్​లకు, ఎంపీటీసీలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా మోసం చేసిందో, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. హైడ్రా వల్ల ఏదో జరుగుతుందని భావించామని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలకు తాము వ్యతిరేకం కాదని, చేపట్టే విధానాన్నే తప్పు పడుతున్నామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కనపెట్టి, హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను ప్రభుత్వం కూలుస్తుందన్నారు. హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని, హైడ్రా వల్ల తెలంగాణ అధోగతి పాలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ ఖండిస్తుందని, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బీజేపీ నాయకులను దాటిన తర్వాతే హైడ్రా కూల్చివేతల జోలికి వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు చేస్తామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే రక్తదాన శిబిర కార్యక్రమాలు చేశామని, హెల్త్ క్యాంపుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఖాదీ వస్త్రాలను వేసుకునే కార్యక్రమాలను చేపడతామని ఆయన చెప్పారు. దేశాన్ని నరేంద్ర మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు​ డైవర్షన్​ పాలిటిక్స్​తో ఆటలాడుతున్నాయి: బండి సంజయ్​ - Bandi Sanjay Slams the TG Govt

హైడ్రా పేరుతో కాంగ్రెస్​ హైడ్రామాలాడుతోంది : బండి సంజయ్ - Bandi Sanjay ON Hydra

ABOUT THE AUTHOR

...view details