2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో మీకు తెలుసా? - TIRUMALA HUNDI INCOME FOR YEAR 2024
2024 తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,365 కోట్లు - వెల్లడించిన టీటీడీ
![2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో మీకు తెలుసా? Tirumala Hundi Income For The Year 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/1200-675-23239392-thumbnail-16x9-tiurpati-income-year-2024.jpg)
Tirumala Hundi Income For The Year 2024 (ETV Bharat)
Published : Jan 2, 2025, 1:28 PM IST
Tirumala Hundi Income For The Year 2024 :గతేడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను టీటీడీ వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. ఏడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వివరించింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపింది. ఏడాది మొత్తం 12.44 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు టీటీపీ స్పష్టం చేసింది.