తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబోయ్ పెద్దపులి - ఎవరూ బయటకు వెళ్లొద్దు - ఆదిలాబాద్​లో టైగర్ టెర్రర్

ఆదిలాబాద్​ జిల్లా బోథ్​లో పెద్దపులి సంచారం - భయాందోళనకు గురైన గ్రామస్థులు - పట్టుకునేందుకు జల్లెడ పడుతున్న అటవీ సిబ్బంది

Tiger Movement In Adilabad District
Tiger Movement In Adilabad District (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

Tiger Movement In Adilabad District :ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చింతలబోరి గ్రామశివారులోని ఫారెస్ట్​ సిబ్బందికి మంగళవారం కనిపించిన పెద్దపులి బుధవారం చింతగూడ పరిసరాల్లో ఉదయం 6 గంటలకు ఓ మహిళకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారమిచ్చింది. గ్రామస్థులు వెళ్లి చూడగా ఆ వ్యాఘ్రం అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. కొంతసేపటి తర్వాత కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టేసిన ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి.

పులికోసం జల్లెడపడుతున్న అటవీ సిబ్బంది :చింతగూడ గ్రామస్థులకు కొండ సమీపంలోని పత్తి చేనులో పెద్దపులి అడుగుజాడలు (పాదముద్రలు) కనిపించాయి. బుధవారం సుమారు 20 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పులిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బాబెరతండాలోని జాదవ్‌ దిలీప్​నకు చెందిన ఎద్దుపై చింతగూడ ఫారెస్ట్​ ఏరియాలోని పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. ఇటీవల కాలంలో వన్యప్రాణులు తరచూ జనావాసాలకు సమీపంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు అటవీ ప్రాంతాలు కాంక్రీట్​ జంగిల్​గా మారుతుండటంతో వాటి అవాసాలకు నష్టం వాటిల్లుతోంది.

అక్కడ సంచరించింది చిరుత పులి కాదు పిల్లి :ఇటీవల మియాపూర్​ మెట్రో స్టేషన్​ వెనుక బాగంలో చిరుతపులి సంచరిస్తోందంటూ వచ్చిన వార్తలు ఇటీవల కలకలం రేపాయి. ఆ దృశ్యాలను కూడా కొంతమంది సోషల్​ మీడియాలో పంచుకున్నారు. ఇవి వైరల్​గా మారడంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు మెట్రో స్టేషన్​కు సమీపంలోని నడిగడ్డ తండా ప్రాంతమంతా జల్లెడ పట్టారు. చివరకు ఆ జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు అది పులి కాదని అడవి పిల్లిగా నిర్ధారించారు.

జనావాసాలకు దగ్గరలో పులి సంచారం :కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో జరిగింది. తాడోబా అభయారణ్యాల నుంచి కాగజ్​నగర్​ అటవీ ప్రాంతానికి వచ్చిన ఎస్​-13 పులి జనావాసాలకు అతి సమీపంలో సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల్లో ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంత సమీపంలోకి చేలకు వెళ్లకూడదని హెచ్చరించారు.

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం - పశువుల కాపరులు ఒంటరిగా తిరగొద్దని పోలీసుల హెచ్చరిక - Leopard Wandering in Medak District

అలర్ట్ : 'అక్కడ కనిపించింది చిరుతపులే - ఎవరూ ఒంటరిగా తిరగొద్దు'

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details