MLAs Disqualification Petition :భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ ముగ్గురునీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ - విచారణ సోమవారానికి వాయిదా - MLAs Disqualification Petition
Published : Jul 3, 2024, 3:27 PM IST
BRS MLA's Disqualification Petition Hearing Adjourned : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
![బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ - విచారణ సోమవారానికి వాయిదా - MLAs Disqualification Petition BRS MLA's Disqualification Petition Hearing Adjourned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21858817-thumbnail-16x9-brs-mla.jpg)
BRS MLA's Disqualification Petition Hearing Adjourned (ETV Bharat)