తెలంగాణ

telangana

ETV Bharat / state

లోటు పూడ్చుకునేందుకు ఛార్జీలు పెంచుకుంటాం - ఈఆర్​సీకి డిస్కంల విజ్ఞప్తి

విద్యుత్‌ పంపిణీ సంస్థల వార్షిక ఆదాయంపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ - డిస్కంలకు 2024-25కు సంబంధించి రూ.14వేల 222 కోట్లు ఆదాయ లోటు - విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు

PETITION TO ERC IN TELANGANA
Telangana Electricity Regulatory Commission on Income (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 4 hours ago

Telangana Electricity Regulatory Commission on Income : విద్యుత్‌ పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. ఎస్పీడీసీఎల్​కు సంబంధించిన వార్షిక ఆదాయ నివేదికపై బహిరంగ విచారణ చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో డిస్కంలకు రూ. 14 వేల 222 కోట్లు ఆదాయలోటు ఉన్నదని డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి పిటిషన్‌ దాఖలు చేశాయి. ఉత్పత్తి సంస్థల నుంచి కొంటున్న కరెంట్​కు, వినియోగదారులకు పంపిణీ చేస్తున్న విద్యుత్​కు భారీగా లోటు ఉందని వాటిని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచుకునేందుకు స్వల్పంగా అవకాశం ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ఎదుట పిటిషన్ దాఖలు చేశాయి. ఇందులో ఛార్జీల పెంచడం ద్వారా రూ.1,200 కోట్లు సమకూరితే, మిగిలిన 13 వేల 22 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూపంలో అందుతుందని ఈఆర్సీకి నివేదించాయి.

ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, సంస్థ ఇతర ఉన్నతాధికారులు ఈ బహిరంగ విచారణకు హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని, ఎల్‌.టి, హెచ్.టీ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్‌ ఛార్జీల రూపేణా వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ తరుఫున వాదనలు వినిపించిన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఛార్జీలు పెంచకూడదని పేర్కొన్నారు.

కమిషన్ విచారణకు హాజరైన వినియోగదారులు :బహిరంగ విచారణలో వివిధ రంగాలకు చెందిన విద్యుత్ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు, రైతులు, రాజకీయ నేతలు సైతం కమిషన్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. విద్యుత్ డిమాండ్​ను కావాలని అధికంగా చూపెడుతున్నారని విద్యుత్ రంగ నిపుణుడు వేణు గోపాల్​రావు అందోళన వ్యక్తం చేశారు.

మరోవైవు వాస్తవ రెవెన్యూ గ్యాప్ రూ. 5,958 కోట్లు ఉంటుందని ఎస్పీడీసీఎల్ అంచనా వేస్తోంది. రాబోయే అక్టోబర్- మార్చి మాసాల్లో ప్రతిపాదిత ఫిక్స్​డ్ ఛార్జీల ద్వారా రూ. 1,028 కోట్లు వస్తోందని ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. వీటిలో ఎల్.టీ వినియోగదారుల నుంచి ఫిక్స్​డ్ ఛార్జీల రూపంలో రూ. 328 కోట్లు, హెచ్.టీ వినియోగదారుల నుంచి రూ. 94 కోట్లు, హెచ్.టీ వినియోగదారులకు పెంచిన ఎనర్జీ ఛార్జీల రూపేణా రూ.606 కోట్లు సమకూరే అవకాశం ఉందని డిస్కంలు భావిస్తున్నాయి.

వినియోగదారులకు 'కరెంట్' షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - ELECTRICITY CHARGES REVISE IN TG

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details