తెలంగాణ

telangana

పారాలింపిక్స్​లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ - కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Wins Bronze Medal

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 9:48 AM IST

Updated : Sep 4, 2024, 10:41 AM IST

Deepthi Jeevanji Wins Bronze Medak In Paralympics : పారాలింపిక్స్​లో వరంగల్​ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, క్యాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్​లో పతకం సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా నిలిచింది.

Telangana Athlete Deepthi Jeevanji Wins Bronze Medal in Paralympics
Telangana Athlete Deepthi Jeevanji Wins Bronze Medal in Paralympics (ETV Bharat)

Telangana Athlete Deepthi Jeevanji Wins Bronze Medal in Paralympics : పారిస్​లో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల్లో ఓరుగల్లు క్రీడాకారిణి సత్తా చాటింది. పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించారు. మంగళవారం రాత్రి పారిస్​లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని ముద్దాడింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్​లో కాంస్యం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

మేధోపరమైన బలహీనత ఉన్నప్పటికీ : జీవాంజి దీప్తికి పుట్టుకతోనే మానసిక వైకల్యం. మరోవైపు పేదరికం. ఎన్నో అవమానాలు. కానీ తనకు వచ్చిన పరుగునే నమ్ముకుని ముందుకెళ్లింది. దీంతో ఇప్పుడామె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అలా పారిస్​ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రీడల్లో మహిళల టీ20 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతోంది.

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!

వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన అమ్మాయి దీప్తి. ఆమె తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి కూలీ పనులు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న అర ఎకరం భూమి కూడా అమ్మేసుకున్నారు. అయితే మరోవైపు దీప్తి చిన్నప్పటి నుంచి వేగంగా పరుగెత్తెతు థ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టిలో పడింది. దీంతో దీప్తిని హైదరాబాద్​కు తీసుకొచ్చాడాయన. అలా అనంతరం ఆమె పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించడం ప్రారంభించింది.

ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పారాలింపిక్స్​కు అర్హత :గతేడాది ఆసియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శన చేసి పసిడి గెలిచింది దీప్తి. అప్పుడు దక్కిన ప్రైజ్ మనీ రూ.30 లక్షలతో తల్లిదండ్రులకు మళ్లీ భూమి కొని ఇచ్చింది. ఇంకా ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది. అలానే ప్రపంచ రికార్డు ప్రదర్శనతో(55.07 సెకన్లు) పారిస్​ పారాలింపిక్స్​కు అర్హత సాధించింది.

వైకల్యాన్ని దాటి పతకాల వేటకు సై - పారిస్ పారాలింపిక్స్​లో తెలుగు తేజాలు - Paris Paralympics 2024

Asian Games 2023 : ఆసియా గేమ్స్​లో తెలుగు తేజాలు.. గోల్డ్​ మెడల్​ టార్గెట్​గా బరిలోకి!

Last Updated : Sep 4, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details