Police Raids at Janwada Farmhouse : హైదరాబాద్ జన్వాడలోని ఫామ్హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్పాకాల ఫామ్హౌస్లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో పోలీసులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు.
మద్యం పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌజ్ యజమాని రాజ్ పాకాలా కేటీఆర్ బావమరిదిగా గుర్తించారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.