తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు - సహజ మరణంగా అందరినీ నమ్మించి, ఇలా దొరికిపోయారు - Man killed Father in law

ఆస్తి కోసం అత్త సహాయంతో మామను చంపిన ఇల్లరికం అల్లుడు - అనుమానంతో ఫిర్యాదు చేసిన చిన్న కుమార్తె - పోలీసుల విచారణలో వెలుగులోకి హత్య ఘటన

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Man Killed Father in Law for Property in Nizamabad
Man Killed Father in Law for Property (ETV Bharat)

Man Killed Father in Law for Property : అతడో ఇల్లరికం అల్లుడు. తన మామ పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకోవాలన్న దుర్భుద్ధి పుట్టింది. అతడి దుర్భుద్ధి ఆలోచనలకు అత్త సైతం సహకరించింది. ఆమెతో కలిసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్మీర్‌గల్లీకి చెందిన క్యామొళ్ల శంకర్‌ (50) మేకల కాపరి. అతనికి భార్య చిన్నమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. పెద్దల్లుడు రవి ఇల్లరికంగా అత్తగారింట్లోనే ఉంటున్నాడు. శంకర్‌కు ఇంటితో పాటు మరో ఖాళీ జాగా, జీవాలు ఉన్నాయి. వీటి కోసం రవి శనివారం రాత్రి మామతో గొడవపడ్డాడు. తర్వాత అత్త చిన్నమ్మతో చర్చించి, మామను అంతమొందించాలనుకున్నాడు.

మేకల కొట్టంలో నిద్రిస్తున్న శంకర్‌ను ప్రణాళిక ప్రకారం అర్ధరాత్రి వేళ రవి, చిన్నమ్మ కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తీసుకొచ్చి, సహజ మరణంగా అందరినీ నమ్మించారు. పట్టణంలోనే ఉంటున్న రెండో కుమార్తె సవిత తండ్రి మృతి వార్త తెలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో మృతదేహంపై మెడ వద్ద గాట్లు చూసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సీఐ వెంకటనారాయణకు హత్యకు సంబంధించిన ఆధారాలు లభించడంతో రవి, చిన్నమ్మలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితులిద్దరూ హత్య చేసినట్లు అంగీకరించారని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం : మరోవైపు అప్పుల బాధలు తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. కొండ రాజబాపు (45) అనే కౌలు రైతు అప్పుల బాధలు భరించలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొన్నేళ్ల క్రితం పలిమెల మండలంలో భూమిని కౌలుకు తీసుకొని రాజబాపు పత్తి పంట వేశారు. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులతో పంట నష్టపోయారు.

కొండ రాజబాపు (ETV Bharat)

దీంతో రూ.7 లక్షల వరకు అప్పుల పాలయ్యారు. అనంతరం కాటారంలో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశారు. అక్కడా సుమారు రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. మూడేళ్ల క్రితం రాజబాపు కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె చనిపోయిందనే మనస్తాపంతో పాటు అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం కలుపు నివారణ మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రాజబాపును వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

బావమరిది చస్తే ఆస్తంతా నాదే : బెట్టింగ్​లతో రూ.కోట్లలో నష్టపోయి - అత్తింటి ఆస్తిపై కన్నేసి - Man Killed Bro in Law For Property

నా పెళ్లాన్ని నాకు దూరం చేస్తారా? - కోపంతో యువతి తల్లిదండ్రులను చంపిన యువకుడు - YOUNG MAN KILLS LOVER PARENTS

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details