ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

40 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా- ఇద్దరి పరిస్థితి విషమం - 20 People Injured In Road Accident

Road Accident In Palnadu District 20 People Injured : నలభై మంది ప్రయాణికులు ఉన్న బస్సు పల్నాడు జిల్లా లింగంకుంట్ల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 11:17 AM IST

road_accident_in_palnadu_district_20_people_injured
road_accident_in_palnadu_district_20_people_injured (ETV Bharat)

40 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా- ఇద్దరి పరిస్థితి విషమం (ETV Bharat)

Road Accident In Palnadu District 20 People Injured :పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఆ బస్సుల 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ అంబులెన్స్‌ ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు లింగంగుంట్ల వద్ద అదుపుతప్పి పక్కకు పడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details