ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్ మాఫియా గ్యాంగ్​వార్ - ఆధిపత్యం కోసం పరస్పరం కార్లతో ఢీ - Ration Mafia Gang War in Tiruvuru

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 1:03 PM IST

Updated : Sep 16, 2024, 2:24 PM IST

Illegal Ration Rice Seized in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు మితిమిరిపోతున్నాయి. చౌక బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన వర్గాలు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన ఆ గ్రూప్​కు చెందిన వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడి కారుతో ఢీ కొట్టారు. ఇది చూసి అక్కడి ప్రజలకు భయాందోళనకు లోనయ్యారు.

Ration Mafia Gang War in Tiruvuru
Ration Mafia Gang War in Tiruvuru (ETV Bharat)

Ration Mafia Hulchal in Tiruvuru :అక్రమ వ్యాపారంలో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీపడటం అందుకోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. తిరువూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. ఈ దందాను సాగిస్తున్న రెండు వర్గాలు ఆధిపత్య పోరులో భాగంగా వారు సినిమా ఛేజ్​ను తలపించేలా పరస్పరం కార్లతో ఢీకొట్టుకోవడం కలకలం రేపింది.

తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేఛ్చగా సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి రాజుపేటలోని రైస్‌మిల్లు కేంద్రంగా కాకినాడ పోర్టుకు ప్రతినెలా పదుల సంఖ్యలో చౌక బియ్యం లారీలను తరలించి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వం మారాక అతని వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. ఆ దందాను మరో మాఫియా నిర్వాహకుడు చేజిక్కించుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.

భయాందోళనలకు గురైన స్థానికులు : ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఎ.కొండూరు మండలం గోపాలపురం నుంచి చౌక బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ ముఠా సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మరోవర్గం వారు యూట్యూబ్‌ ఛానళ్ల విలేకరులతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లారీకి కారును అడ్డుపెట్టి పౌరసరఫరాల శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మాఫియాలోని వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. లారీకి అడ్డుగా ఉన్న కారును మరో కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ కారు రోడ్డు పక్కనున్న కాల్వలోకి పల్టీ కొట్టింది. ఇదంతా చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

PDS Rice Smuggling in AP :ఈ గొడవ జరుగుతుండగానే బియ్యం లారీని అక్కడి నుంచి పంపించారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద అధికారుల తనిఖీలో దొరికింది. మరోవైపు గోపాలపురానికి ఆలస్యంగా చేరుకున్న పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులకు మరో విచిత్ర అనుభవం ఎదురైంది. ఇక్కడి నుంచి బియ్యం తరలిస్తున్న లారీకి బదులు, గుంటూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చౌక బియ్యం తరలిస్తూ పోలిశెట్టిపాడు సమీపంలోని పెట్రోల్‌ బంకులో నిలిపి ఉన్న లారీ పట్టుబడింది. దీనిపై డిప్యూటీ తహసీల్దార్‌ శ్వేతను వివరణ కోరగా తాము ఘటనా స్థలానికి చేరుకోకముందే ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు.

కాకినాడ కేంద్రంగా విదేశాలకు రేషన్​ బియ్యం- 51,427 మెట్రిక్‌ టన్నులు సీజ్​ - ration rice exported

కొనసాగుతున్న రేషన్​ బియ్యం దందా- గుంటూరు జిల్లాలో 100 టన్నులు పట్టివేత - Ration Rice Smuggling in Guntur

Last Updated : Sep 16, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details