ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎట్టకేలకు పట్టాలెక్కిన కేసు- మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు! - Raghu Rama krishna Raju Complaint

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 10:36 AM IST

Raghu Rama krishna Raju Complaint Leads to Case : రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది.

raghu_rama_krishna_raju_complaint_leads_to_case
raghu_rama_krishna_raju_complaint_leads_to_case (ETV Bharat)

Raghu Rama krishna Raju Complaint Leads to Case : ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ సాగించిన అరాచకాలపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. తనపై హత్యాయత్నం చేసినవారితోపాటు అందుకు ప్రోత్సహించినవారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించినవారిని కూడా బాధ్యులుగా చేయాలని రఘురామ పోలీసులను కోరారు.

రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ పూర్వపు డీజీ సునీల్‌కుమార్, అప్పటి నిఘా బాస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మరో నిందితుడు, అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు నోటీసు పంపించి నాటి ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు అందించాలని దర్యాప్తు అధికారులు కోరారు. ఈ క్రమంలో పోలీసులు విజయ్‌పాల్‌ కోసం గాలిస్తున్నారు. విజయ్‌పాల్‌ సెల్‌ఫోన్‌, సిమ్‌కార్డులు మార్చి తప్పించుకుని తిరుగుతున్నారు. వారం క్రితం పోలీసు బృందం దిల్లీ వెళ్లగా విజయ్‌పాల్‌ అక్కడ నుంచి పరారయ్యారు.

విజయవాడలోని విజయ్‌పాల్ ఇంటికి నోటీసులు పంపిన పోలీసులు, విచారణకు రావాలని ఆదేశించారు. రఘురామకృష్ణరాజు విచారణ సమయంలో ఏం జరిగిందో వివరాలు అందించాలని దర్యాప్తు అధికారులు నోటీసులలో కోరారు. ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఉండడంతో నోటీసును రిజిస్టర్ పోస్టు ద్వారా విజయవాడలోని ఇంటికి పంపించారు.

'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview

అప్పట్లో నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న రఘురామ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైనా, నాటి సీఎం జగన్‌ పైనా విమర్శలు చేశారన్న నెపంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నాటి ఘటనపై రఘురామ గుంటూరు జిల్లా ఎస్పీకి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఆనాడు రఘురామను హైదరాబాద్‌ నుంచి ఎలా తీసుకొచ్చారు? ఎన్ని వాహనాలను వినియోగించారు? ఏ స్థాయి అధికారులు పాల్గొన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మీడియా వల్లే బతికాను - గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ - Mla Raghu Rama Raju Met Guntur SP

ABOUT THE AUTHOR

...view details