తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరో తెలిసినా ఫిర్యాదు చేయట్లేదు - బాధితుల మౌనమే నేరాలకు దన్ను - People not Giving Complaints - PEOPLE NOT GIVING COMPLAINTS

No Complaint on Fraudsters : దొంగతనాలు, అత్యాచారాలు, మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఎవరో అని బాధితులకు తెలిసినా ఫిర్యాదు చేయడం లేదు. పక్కా ఆధారాలున్నా ఫిర్యాదు చేయకపోవడంతో నేరగాళ్లు పోలీసులకు కొత్త సవాల్​ విసురుతున్నారు. గుట్టు బయటపడుతుందనే ఒక భయమైతే పరువుపోతుందని మౌనంగా ఉంటున్నారు. వారి మౌనమే కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

People not Complaining on Fraudsters
No Complaint on Fraudsters (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 1:46 PM IST

People not Complaining on Fraudsters :చోరీలు, అత్యాచారాలు, మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు పోలీసులు కొత్త సవాల్​ విసురుతున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్నారు. దారుణాలకు పాల్పడిన వాళ్లు ఎవరో అని తెలిసినా పక్కా ఆధారాలున్నా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వారి గుట్టు కూడా బయటపడుతుందనే గుబులు ఒకటైతే పరువు పోతుందనే భయంతోనే మౌనం ఉంటున్నారు.

సొమ్ములు పోయినా గప్‌చుప్‌

  • నగరంలోని రాచకొండ పరిధిలో ఇటీవల ఓ పాలవ్యాపారి ఇంట్లో రూ.2 కోట్లు చోరీకి గురైంది. పోలీసులకు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే డబ్బు వివరాలు బయటపడతాయన్న కారణంతో 15 లక్షల రూపాయలు పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి రూ.85 లక్షలు స్వాధీనం చేసుకున్నారు, కరడుగట్టిన దొంగను అరెస్టుచేశారు.
  • సికింద్రాబాద్‌లోని ఓ బంగారు దుకాణంలో రూ. 1.5 కోట్లు విలువైన నగలు చోరీకి గురయ్యాయి. దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్మగ్లింగ్​ దందా బయటపడుతుందని యజమాని భావించారు.
  • నగర శివారులోని ఓ ప్రముఖుని నివాసంలో బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఆయన మౌఖిక ఆదేశాలతో సొమ్ము రికవరీ చేయించుకున్నారు. దొంగలు పట్టుబడినా కేసు నమోదు చేయకపోడంతో పోలీసులు వారని హెచ్చరించి వదలేసినట్లు సమాచారం.
  • అందమైన అమ్మాయిల మెసేజ్​లకు, వీడియోకాల్స్​కు ఆకర్షితులై వలపువలలో చిక్కి కొందరు రూ. లక్షలు నష్టపోతున్నారు. అయినా బాధితుల్లో కేవలం 5 శాతం మంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు చెప్పారు.
  • గొలుసుకట్టు, సైబర్‌ మోసాల్లోనూ రూ.10 వేల లోపు నష్టపోతున్న బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అభిప్రాయంతో మౌనంగా ఉంటున్నారు.

ఫిర్యాదు చేయడానికి సతమతమవుతున్న బాధితులు : ఇటీవల అరెస్టయిన దొంగ వద్ద లభించిన మొబైల్​ ఫోన్​లో పలువురు మహిళల నగ్నఫొటోలు, వీడియోలు చూసి పోలీసులు షాక్​కు గురయ్యారు. దొంగతనాలకు వెళ్లేముందు కల్లు దుకాణాల్లో చిరు వ్యాపారాలు చేసే మహిళలను పరిచయం చేసుకుంటాడు. డబ్బులిస్తానని ఆశచూపి హోటల్‌ తీసుకెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరిస్తాడు. శారీరక అవసరం తీరాక వీడియోలు చూపించి వారి నగలు, డబ్బులు కొట్టేసి పారిపోతాడు. నగరంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా గడిపేందుకు ప్రేమజంటలు చేరతాయి.

వీరి ఫొటోలు, వీడియోలు సైతం తీస్తూ కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, నగలు చోరీ చేయడంతోపాటు కొందరు యువతులపై అత్యాచారాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఫిర్యాదు చేయడానికి బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంతో దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details