Palla Srinivas new state president of TDP :ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాస రావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపులో అగ్రతాంబూలం ఇస్తూ వచ్చిన పార్టీ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా మరోసారి బీసీ నేతకే ఇవ్వాలని నిర్ణయించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర అధ్యక్షునిగా ఖరారు చేసినట్లు సమాచారం.
నన్ను జైలుకు పంపినందుకు నేను చేయబోయేది ఇదే : ఏపీ సీఎం చంద్రబాబు - AP CBN Fires IAS And IPS