ETV Bharat / state

మాంసం, చేపలు, రొయ్యలు ఫ్రిజ్​లో పెడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోండి - DISADVANTAGES OF FRIDGE FOOD

ఆహారపదార్థాలను ఎక్కువగా ఫ్రిజ్​లో ఉంచడం వల్ల నష్టాలు - ఆరోగ్య నిపుణులు చెబుతున్న పరిష్కారమార్గాలు

Things Should Not Keep In Fridge
Things Should Not Keep In Fridge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 4:24 PM IST

Things Should Not Keep In Fridge : ఇంట్లో మనం రోజూ వంట చేసుకుంటాం. కానీ వచ్చిన చిక్కేమిటంటే కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయలేక రిఫ్రిజిరేటర్​లో పెట్టేస్తాం. కానీ ఫ్రిజ్​ను వీలైనంత తక్కువ వాడమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే

  1. కూరగాయలు, పండ్లు తాజాగా ఉన్నవి చూసి కొనండి. ఎక్కువ కొని ఫ్రిజ్‌లో ఉంచారంటే అందులో ఉండే పోషకాలు క్రమంగా తగ్గిపోతాయి.
  2. వండిన కూరలు తాజాగా తినడం ఉత్తమం. మిగిలిన కూరలను మర్నాడు తింటే పరవాలేదు. మూడు రోజులు గనుక నిల్వ ఉంచారంటే అది విషతుల్యమవుతుంది. మసాలా కూరలు, సలాడ్స్‌ అలా ఉంచితే మరీ ప్రమాదకరం.
  3. పాలు, చీజ్‌ లాంటి హై ప్రొటీన్‌ ఉన్న పదార్థాలకు బ్యాక్టీరియా వేగంగా చేరే అవకాశం ఉంది. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలి.
  4. పచ్చి మాంసం, చేపలు, రొయ్యలు లాంటివి నిల్వ ఉంచి తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం ఉంది.
  5. అన్నం, పాస్తా, దుంపలు లాంటివి రిఫ్రిజిరేటర్​లో పెట్టకూడదు.
  6. మర్నాడు పని సులభమవుతుందని కూరగాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
  7. ఒకేసారి పనైపోతుంది కదా అని చెప్పి ఎక్కువ పరిమాణంలో కూరగాయలు, పండ్లు కొనకుండా అవసరమైనంత మేరకే కొనటం అలాగే ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి వంటచేయటం అలవాటు చేసుకుంటే పండ్లూ పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచనవసరం ఉండదు.

Things Should Not Keep In Fridge : ఇంట్లో మనం రోజూ వంట చేసుకుంటాం. కానీ వచ్చిన చిక్కేమిటంటే కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయలేక రిఫ్రిజిరేటర్​లో పెట్టేస్తాం. కానీ ఫ్రిజ్​ను వీలైనంత తక్కువ వాడమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే

  1. కూరగాయలు, పండ్లు తాజాగా ఉన్నవి చూసి కొనండి. ఎక్కువ కొని ఫ్రిజ్‌లో ఉంచారంటే అందులో ఉండే పోషకాలు క్రమంగా తగ్గిపోతాయి.
  2. వండిన కూరలు తాజాగా తినడం ఉత్తమం. మిగిలిన కూరలను మర్నాడు తింటే పరవాలేదు. మూడు రోజులు గనుక నిల్వ ఉంచారంటే అది విషతుల్యమవుతుంది. మసాలా కూరలు, సలాడ్స్‌ అలా ఉంచితే మరీ ప్రమాదకరం.
  3. పాలు, చీజ్‌ లాంటి హై ప్రొటీన్‌ ఉన్న పదార్థాలకు బ్యాక్టీరియా వేగంగా చేరే అవకాశం ఉంది. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలి.
  4. పచ్చి మాంసం, చేపలు, రొయ్యలు లాంటివి నిల్వ ఉంచి తినడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం ఉంది.
  5. అన్నం, పాస్తా, దుంపలు లాంటివి రిఫ్రిజిరేటర్​లో పెట్టకూడదు.
  6. మర్నాడు పని సులభమవుతుందని కూరగాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.
  7. ఒకేసారి పనైపోతుంది కదా అని చెప్పి ఎక్కువ పరిమాణంలో కూరగాయలు, పండ్లు కొనకుండా అవసరమైనంత మేరకే కొనటం అలాగే ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి వంటచేయటం అలవాటు చేసుకుంటే పండ్లూ పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచనవసరం ఉండదు.

వండిన కూర ఫ్రిజ్​లో రెండు రోజులు ఉంచినా - పచ్చి మాంసం స్టోర్​ చేసినా జరిగేది ఇదే!

చట్నీలను ఫ్రిజ్​లో పెట్టి తింటున్నారా? నాన్​వెజ్ పెట్టినా కూడా బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.