తెలంగాణ

telangana

ETV Bharat / state

20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి - నచ్చక 2 నెలల క్రితం కోడలి హత్య - AUNTY MURDER DAUGHTER IN LAW

20 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జంట - కొడలిని అతి కిరాతకంగా హత్య చేసిన అత్తామామలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 10:37 AM IST

Updated : Jan 10, 2025, 12:29 PM IST

Mother-in-Law Kills Daughter-in-Law in Shamshabad :ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం ఉండదు. కానీ కొంత మంది తల్లిదండ్రులు తమ పరువు ఎక్కడ పోతుందో అని ప్రేమ పెళ్లికి అంగీకరించరు. కొందరు మాత్రం తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంటారు. ఇదే విధంగా 20 సంవత్సరాల క్రితం ఓ ప్రేమ జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కోడలిపై పగ పెంచుకున్న అత్తామామ, ఆమెను అతి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు : తమకు ఇష్టం లేకుండా కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కోడల్ని అత్తా మామలు హత్య చేసి పాతిపెట్టిన సంఘటన ఇది. 2 నెలల కిందట జరిగిన హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ రెడ్డి వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం రామాంజపూర్‌ తండాకు చెందిన దూలి (38), అదే తండాకు చెందిన మూడావత్‌ సురేష్‌ (డ్రైవర్‌) 20 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. మూడావత్‌ సురేష్‌ తల్లిదండ్రులు తులసి, అనంతి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా వారి మాటను కాదని దూలి, మూడావత్‌ సురేష్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు. తమకు ఇష్టం లేకుండా తమ కుమారుడిని వివాహం చేసుకుందని అత్తా మామ తులసి, అనంతి కోడలిపై పగ పెంచుకున్నారు. మూడావత్‌ సురేష్‌ కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో దూలి తరచూ భర్తతో గొడవపడేది. ఈ విషయంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి మంచిగా ఉండాలని సర్ది చెప్పారు.

దూలి (ETV Bharat)

దూలి మృతదేహాన్ని పూడ్చిన అత్తామామలు : ఇదే అదనుగా కోడలిని హత్య చేయడానికి అత్త తులసి పథకం రచించింది. గత సంవత్సరం నవంబరులో దూలికి 2 సార్లు ఫోన్‌ చేసి సాతంరాయికి పిలిపించింది. మూడోసారి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ ఎలుకల మందు కలిపిన కల్లును దూలితో తాగించి, అక్కడే మాటు వేసిన భర్త అనంతి, సోదరుడు హనుమతో కలిసి తలపై బండ రాళ్లతో బాదింది. దూలి చనిపోయిందని నిర్ధారించుకున్నక మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లారు. భార్య కనిపించకపోవడంతో మూడావత్‌ సురేష్‌ తన తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా నవంబరు 14న కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, దూలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఉదయం నుంచి 10 గంటల పాటు శ్రమించి పోలీసులు దూలి మృతదేహాన్ని బయటకు తీశారు.

పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!

'నా భార్యనే చూస్తావా?' - ఇనుప రాడ్డుతో కొట్టి యువకుడి హత్య

Last Updated : Jan 10, 2025, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details