తెలంగాణ

telangana

మేడిగడ్డ బ్యారేజ్ అధ్యయనానికి కమిటీ - ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదన

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 11:46 AM IST

Medigadda Barrage Issue Updates : మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

Medigadda Barrage
Medigadda Barrage

Medigadda Barrage Issue Updates :మేడిగడ్డ ఆనకట్ట వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర సర్కార్‌కు పంపింది. అక్టోబర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో (Medigadda Barrage) ఏడో బ్లాక్‌ కుంగిన విషయం తెలిసిందే. ఈ బ్లాకులో పియర్స్‌ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్‌ దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

Irrigation Department Committee on Medigadda :ఈ క్రమంలోనేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు బ్యారేజ్​ను పరిశీలించి పలు చర్యలకు సిఫార్సు చేశారు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న ఏబీ పాండ్యా బృందం కూడా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తును ముమ్మరం చేశాయి. అయితే మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage Damage) కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా మారింది.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం :ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్‌, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రామరాజు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఓఅండ్‌ఎం) నాగేందర్‌రావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) మురళీధర్‌ తదితరులతో కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సర్కార్ ఆమోదం తర్వాత కమిటీ బ్యారేజీ కుంగడానికి గల కారణాలపైఅధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది.

మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు

ఇప్పటికీ అరకొర పనులే :అనంతరం కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ ఆనకట్ట కుంగి మూడు నెలలు దాటినా కారణాలేంటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కారణాలు తెలుసుకొనేందుకు కమిటీని ఏర్పాటు చేసి, కేంద్ర జలసంఘంతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత పని ప్రారంభించాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాలంలో భారీ వరద వస్తే అదనంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌ పూర్తయిందని గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ ఇప్పటికే తెలిపింది. 2022లోనే బ్యారేజీ ఏడో బ్లాక్‌ గురించి లేఖ రాసి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించినా స్పందించలేదని పునరుద్ధరణ బాధ్యత ఎల్అండ్‌టీ దేనని నీటిపారుదల శాఖ పేర్కొంది. అయినా నిర్మాణ సంస్థ సానుకూలంగా స్పందించలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details