తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పోస్టాఫీస్​లో మీకు అకౌంట్ ఉందా - ఉంటే ఓసారి చెక్​ చేసుకోండి!

పెద్దపల్లి పోస్ట్‌ ఆఫీస్‌లో భారీ మోసం - నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి డిపాజిట్లు మాయం చేసిన మహిళా ఉద్యోగిని - ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Massive Fraud in Peddapalli Post Office
Massive Fraud in Peddapalli Post Office (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Massive Fraud in Peddapalli Post Office :ఈ మధ్యకాలంలో పోస్ట్‌ ఆఫీస్‌లలో ప్రవేశ పెట్టిన పొదుపు స్కీమ్స్‌లో చాలా మంది చేరుతున్నారు. ప్రభుత్వ సంస్థ అని అందులో పొదుపు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, భవిష్యత్తులో పిల్లల జీవితాలకు ఒక భరోసా ఉంటుందని స్కీమ్‌లలో చేరి డబ్బులు జమ చేస్తున్నారు. ఒక్కసారి పిల్లల పేర్లపై ఫిక్స్ డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో ఒకేసారి ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో వారి చదువులకో, లేక పెళ్లికో ఉపయోగపడతాయని భావించి లక్షల కొద్ది డబ్బును స్కీమ్‌ కింద డిపాజిట్ చేస్తున్నారు. చేసిన కష్టాన్ని పిల్లల జీవితాల కోసం వెచ్చిస్తున్నారు. అలాంటి వారిని బురిడి కొట్టించి అయామక ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల : మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామపంచాయతీలోని తపాల శాఖలో బ్రాంచ్‌ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని స్థానిక ప్రజలకు కొన్ని పథకాల గురించి తెలియజేసింది. ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో మీ అవసరాలకు, పిల్లల చదువులకు, పెళ్లిలకు ఉపయోగపడతాయని నమ్మబలికింది. అలా అందరిని నమ్మించి లక్షల కొద్ది డబ్బులు డిపాజిట్ చేయించుకుని నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేసి వారికిచ్చింది. డిపాజిట్‌ చేసిన డబ్బులు స్వాహా చేసింది.

వైరల్​ వీడియో - అమెజాన్​లో ల్యాప్​టాప్​ బుక్​ చేస్తే నాపరాయి వచ్చింది - బాధితుడు ఏం చేశాడంటే ?

ఇలా వెలుగులోకి : అయితే ఇటీవల బదిలీపై వచ్చిన సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శివకుమార్‌కు పలు ఖాతాలపై అనుమానం వచ్చింది. ఏంటా అని కొంతమంది ఖాతాదారులను పిలిపించి వారి పాస్‌ పుస్తకాలను పరిశీలించగా నకిలీవని బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు అందరూ ఆఫీస్‌ దగ్గరకు వచ్చి వారు జమ చేసిన డబ్బులు అకౌంట్‌లో ఉన్నాయా లేదా అని చెక్‌ చేయగా కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురై మహిళా అధికారిణి ప్రశ్నించగా చేసిన తప్పు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో మరొకరి పేరుందని తెలిపారు.

"మా పేరుపై ఖాతాలు తెరిచాను. 9ఖాతాల్లో కలిసి 12లక్షలు జమ చేశాం. కానీ నకిలీవని చెప్తున్నారు ఇక్కడ. మా సంతకాలు పెట్టి కూడా డబ్బును తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లి అని తీసుకున్నాం. కానీ ఇలా మోసం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి." - బాధితురాలు

తిరిగి బాధితుల డబ్బు చెల్లించడానికి నెల గడువు కోరగా బాధితులు ఒప్పుకోవడం లేదు. ఈలోగా తను ఇక్కడి నుంచి వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థ అని నమ్మి లక్షల కొద్ది డబ్బులు జమ చేస్తే తమని నట్టేటా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నాతాధికారులకు తెలియజేయడంతో తపాలాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు రూ.20 లక్షలకు పైగా మోసం జరిగిందని తేలింది. పూర్తి విచారణ అనంతరం ఈ సంఖ్య పెరగనుంది.

'మీ ఇల్లు మూసీ బఫర్​ జోన్​లో ఉందా? - మీరు భయపడాల్సింది బుల్డోజర్​కు కాదు వీళ్లకు'

మీకు తెలీకుండానే మీ పేరుపై బ్యాంకుల్లో లోన్లు - మీ ఖాతా ఓసారి చెక్ చేసుకుంటే బెటర్

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details