తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో ఎరుపెక్కిన రోడ్డు - భయాందోళనలో స్థానికులు - MANHOLE FILLED WITH CHEMICAL WASTE

హైదరాబాద్​లోని జీడిమెట్లలో మ్యాన్‌హోల్‌ నుంచి ఉబికి వచ్చిన ఎరుపు రంగు నీరు - భయాందోళనకు గురైన స్థానికులు - ట్యాంకర్స్​లో తెచ్చి మూసీలో కలుపుతున్న కెమికల్​ వ్యర్థాలు

Manhole Filled With chemical waste
Manhole Filled With chemical waste In Jeedimetla (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 10:57 AM IST

Manhole Filled With chemical waste In Jeedimetla :అక్కడ హత్యలు.. రోడ్డు ప్రమాదాలు జరగలేదు. కానీ ఆ దారుల్లో ఎరుపు రంగుతో నీరు వరదలా ప్రవహించింది. చూసేందుకు రక్తం మాదిరే ఉంటంతో ఏంటా ఎరుపు రంగు అని స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా ఎక్కడైనా హత్యకు గురయ్యారా లేక జంతువుల వధ నిర్వహించారా అని ఆలోచనలో పడ్డారు. చూస్తూ ఉంటే అక్కడ ప్రజలు భరించలేని దుర్గంతమైన వాసన వెలువడింది. ఏంటా వాసన అని.. ఊపిరిసడలక ముక్కు మూసుకున్నారు. చివరికి విషయం తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నా.. వాసన మాత్రం భరించలేకపోయారు. ఇంతకీ ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

గోదాముల రసాయనాలు : హైదరాబాద్​లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో సోమవారం సాయంత్రం మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. ఆ నీరు రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతకీ ఏంటా ఎరుపు రంగు అని, ఎక్కడి నుంచి వస్తుందోనని ఎరుపు రంగు పారిన రోడ్డు వెంబడి కొందరు వెళ్లారు.

మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపు రంగు నీరు : కాలనీలో కొంతమంది రీసైక్లింగ్ పరిశ్రమలను నిర్వహిస్తూ రసాయనాల డ్రమ్ములను కడిగి నాలాల్లో పారబోయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని అనుమతులు లేకుండా ఇండ్ల మధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో రోడ్డుపై పారుతున్న ఎరుపు రంగు నీరు (ETV Bharat)

లారీల్లో తీసుకొచ్చి కెమికల్స్​ను మూసీ కలుపుతున్న నిర్వాహకులు : కంపెనీల నుంచి వచ్చిన విషపూరితమైన కెమికల్స్​ను గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళిక ప్రకారం రాజేంద్రనగర్​ పోలీస్​ లిమిట్స్​లోని బాపూ ఘాట్​కు తరలించిన లారీనీ స్థానికులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రతి రోజు 5 నుంచి 10 ట్యాంకర్ల కెమికల్​ వేస్టేజ్​ను తీసుకొని వచ్చి వారు ఏర్పరచుకున్న డ్రైనేజ్​ ద్వారా విషపూరితమైన కెమికల్​ను మూసీ నదిలో కలుపుతున్నారని స్థానికులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతో స్థానికులు కాపు కాసి ఇవాళ వారిని పట్టుకున్నారు.

ఓవైపు ప్రభుత్వం మూసీ నది శుద్ధీకరణ చేస్తుంటే.. మరోవైపు కొందరు దుండగులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ఈ కెమికల్​ నీరు తాగి స్థానికులు అనారోగ్య సమస్యలతో పాటు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని చిన్న విషయంగా పరిగణించాలని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చర్లపల్లిలో డ్రైనేజీ పైప్​లైన్​ బ్లాస్ట్ ​- భయంతో పరుగులు తీసిన స్థానికులు

How to Lodge GHMC Complaints Online : మీ బజార్లో సమస్యా..? GHMCకి వాట్సాప్ చేయండి చాలు!

ABOUT THE AUTHOR

...view details