తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎయిర్​పోర్ట్​ల తరహాలో రైల్వేస్టేషన్లు - సికింద్రాబాద్ సహా ఈ స్టేషన్లకు మహర్దశ

అమృత్​ భారత్​ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి - అత్యధికంగా సికింద్రాబాద్​ స్టేషన్​కు నిధులు - రాజధాని పరిధిలోనే మొత్తం 12 స్టేషన్లు

SECUNDERABAD RAILWAY STATION
RAILWAY STATIONS MODEL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Amrit Bharat Scheme in Telangana : హైదరాబాద్​ పరిధిలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇందుకోసం ఏకంగా రూ.514.49 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే చర్లపల్లి స్టేషన్​ పనులు పూర్తికాగా వచ్చే ఏడాదికి సికింద్రాబాద్‌ స్టేషన్‌ అందుబాటులోకి తయారుకానుంది. చర్లపల్లి కోసం రూ.430 కోట్లు, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రూ.720 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​ కాకుండా మరో 11 స్టేషన్లను అమృత్‌భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

12 హైదరాబాద్​లోనే :మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్‌పుర, ఉమ్దానగర్‌ స్టేషన్ల పనులు మరో 6 నెలల్లో పూర్తికానున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మరో ఏడు స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పథకం లో రాష్ట్రవ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా హైదరాబాద్​లోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.

అభివృద్ధి పనులివే

  • ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు, స్టేషన్‌కు దారితీసే రోడ్లు వెడల్పు చేయడం ద్వారా రాకపోకలు సులభతరం చేయడం.
  • ప్రయాణికుల సౌకర్యార్ధం సైన్‌ బోర్డులు, వాహనాల కోసం పార్కింగ్‌ సదుపాయం, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాల అభివృద్ధి, స్టేషన్‌లో విద్యుదీకరణ.
  • ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చదనం, కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలు, స్టాళ్ల ఏర్పాటు.
  • సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రాంగణానికి రెండో ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం, స్టేషన్‌ భవన నిర్మాణం.
  • ఎక్కువ ఎత్తులో ప్లాట్‌ఫాంల ఏర్పాటు, సరిపడా షెల్టర్ల నిర్మాణం.
  • మరింత నాణ్యత గల ఎల్‌ఈడీ స్టేషన్‌ నేమ్‌ బోర్డులు, అధునాతన వెయిటింగ్‌ హాళ్ల అభివృద్ధి, పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్.
  • నగర కేంద్రాలుగా స్టేషన్లను అభివృద్ధి చేయడం, స్టేషన్‌ భవనాల అభివృద్ధి, పునరాభివృద్ధి, రద్దీకి ఆస్కారం లేకుండా ట్రాఫిక్‌ సర్క్యులేషన్, ఇంటర్‌ మోడల్‌ ఇంటిగ్రేషన్‌ వ్యవస్థ ఏర్పాటు

నిధుల మంజూరు :హైదరాబాద్- 309 కోట్లు , హఫీజ్​ పేట్​- 26.60 కోట్లు , హైటెక్​ సీటీ- 26.60 కోట్లు , హుప్పు గూడ-26.81 కోట్లు ,మలక్​పేట్​- 36.44 కోట్లు , మల్కాజ్​గిరి- 27.61 కోట్లు ,బేగంపేట్​- 22.57 కోట్లు , మేడ్చల్​- 8.37 కోట్లు , షాద్​నగర్​- 9. 59 కోట్లు , ఉమ్దానగర్- 12.37 కోట్లు , యాకుత్​పురా- 8.53 కోట్లు.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌, 5భాషలకు ప్రాచీన హోదా- కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలివే! - Cabinet Decisions

గోవా ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? సికింద్రాబాద్​ నుంచి డైరెక్ట్​ ట్రైన్ - వివరాలివే​ - Hyderabad To Goa Special Train

ABOUT THE AUTHOR

...view details