IAS Officers Filed Lunch Motion Petition in Telangana HC : ఇటీవల డీవోపీటీ ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రొనాల్డ్ రోస్, సృజన, హరికిరణ్, శివశంకర్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణ డీవోపీటీ ఆర్డర్లపై ధర్మాసనాన్ని ఆశ్రయించారు చేశారు. ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్లో నవంబరు 4న విచారణ ఉందని ఐఏఎస్ల తరఫు న్యాయవాది తెలపగా, అప్పటివరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్లు కోరారు.
ఈనెల 9న ఆ ఐఏఎస్లకు డీవోపీటీ ఉత్తర్వులు : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్రాస్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణకు రావాల్సి ఉంది. ఈ మేరకు డీవోపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ నలుగురు ఐఏఎస్లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ వేశారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.