తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో హై అలర్ట్​ - సందర్శకులు రావొద్దని ప్రకటన - HIGH SECURITY AT SHAMSHABAD AIRPORT

హైదరాబాద్ ఎయిర్​పోర్టులో హైఅలర్ట్​ - జనవరి 31 వరకు సందర్శకులు రావొద్దని ప్రకటన

Hyderabad Airport on high Security Till January 31st
Hyderabad Airport on high Security Till January 31st (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 1:31 PM IST

Hyderabad Airport on high Security Till January 31st :గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 31 వరకు హై అలర్ట్​ ఉంటుందని జీహెచ్​ఐఏఎల్​ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సందర్శకుల గ్యాలరీని మూసి వేస్తున్నందున విజిటర్స్​ రావొద్దని పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసులతో కలిసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్​పోర్టుకు వస్తున్న వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేశాకే లోనికి అనుమతిస్తున్నారు.

రన్ వే పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందిని పెంచారు. ఎయిర్​లైన్స్​ ప్రతినిధులు ప్రయాణికుల సామగ్రిని రెండు దశల్లో సమగ్రంగా పరిశీలించి విమాన సర్వీసులోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు వీడ్కోలు, స్వాగతం పలకడానికి ఇద్దరికి మించి రావొద్దని ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఎయిర్​పోర్టు సిబ్బందికి లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details