ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తంబళ్లపల్లెలో పరువు హత్య ? - బాలికను కడతేర్చిన బంధువులు ! - Honor Killing in Thamballapalle

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 9:29 AM IST

Updated : Aug 14, 2024, 9:43 AM IST

Honour Killing of Minor Girl in Thamballapalle: అన్నమయ్య జిల్లాలో జరిగిన పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన మైనర్‌ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఆమె మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మృతదేహాన్ని బూడిద చేయడంలో పెద్ద మనుషులు, పోలీసులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి.

Honour Killing of Minor Girl in Thamballapalle
Honour Killing of Minor Girl in Thamballapalle (ETV Bharat)

Honour Killing of Minor Girl in Thamballapalle :అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలిక గత నెలలో అదృశ్యం అయ్యింది. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం (Annamayya Honor Killing), బంధువులు, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల తీరు మీదా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చెట్టుకు చున్నీతో ఉరి వేసుకున్న బాలిక : స్థానిక ప్రజలు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక కోసం గాలింపు చర్యలు చెపట్టారు. అమ్మాయిని గుర్తించిన పోలీసులు మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని సర్ది చెప్పి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించడంతో పోలీసులు అమ్మాయిని వారికి అప్పగించారు. తాజాగా పెద్దమండ్యం మండలంలో ఓ గుట్ట వద్ద ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు గొర్రెల కాపరులు సోమవారం గుర్తించి వీఆర్‌వో పక్కీర్‌షా వలీకి తెలియజేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Brother Killed Sister : గొడ్డళ్లతో వేటాడి మరీ యువతిని చంపిన సోదరులు.. వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే..

నేరం రుజవైతే నిందితులపై చర్యలు : బాలిక మృతి చెందినట్లు కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పెద్ద మనుషులు భావించారు. ఈ భయంతో పోలీసులను మేనేజ్‌ చేసి, మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చివేసి బూడిద చేశారు. ఈ విషయంపై మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరగా, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాలిక మృతదేహాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పెద్ద మనుషులు, పోలీసుల ప్రమేయంపై విచారణ చేపడతామని వివరించారు.

ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం- కూతురు, అల్లుడు, మనవరాలి దారుణ హత్య

Uttar Pradesh Honour Killing : ప్రేమించడమే శాపం.. కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పు.. పొలంలోకి ఈడ్చుకెళ్లి..

Last Updated : Aug 14, 2024, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details