తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ - పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్​కు తిరుగు పయనం - వాహనాల రద్దీ ఎక్కువ ఉండటంతో టోల్‌గేట్ ఎత్తేసి వెహికల్స్​కు అనుమతి

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Heavy Traffic in Hyderabad-Vijayawada National Highway
Heavy traffic on national highways (ETV Bharat)

Heavy Traffic in Hyderabad-Vijayawada National Highway : హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండటంతో రద్దీగా మారింది. దసరా పండుగను సొంతూర్లలో బంధుమిత్రులతో కలిసి జరుపుకున్న పలువురు సంబురాలు ముగియడంతో తిరుగు పయనమయ్యారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌కు చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

Festive Rush in KNR National Highway :తెలంగాణ ప్రాంతంలో దసరా, బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించుకుంటారు. దసరా సెలవులు కావడంతో, చిన్నా పెద్దా అంతా కలిసి కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు వచ్చే వాహనాలతో కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. భాగ్యనగరంలో నివాసం ఉన్న తెలంగాణ ప్రాంత వాసులు స్వస్థలాల నుంచి కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్​కు పయనం అవ్వడంతో హుస్నాపూర్ టోల్ గేట్ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. కరీంనగర్ నుంచి వచ్చే మొదటి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల, టోల్​గేట్​ దగ్గర జాప్యం జరుగుతోంది.

రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి : సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారి దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో అందరూ హైదరాబాద్​కు ప్రయాణం కావడంతో టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొని రెండు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దసరా సెలవులకు హైదరాబాద్​ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన ఉద్యోగులు, వ్యాపారస్తులు విద్యార్థులు తిరిగి భాగ్యనగరానికి సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కావడంతో రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో టోల్‌గేట్ ఎత్తేసి రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి ఇచ్చారు. సాధారణ రోజుల కంటే ఈరోజు మరో లైన్​ను అదనంగా పెంచినప్పటికీ వెహికల్స్​ భారీగా రావడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

మహానగరం ట్రాఫిక్​పై పోలీసుల స్పెషల్ ఫోకస్​ - వానొచ్చినా, వరదొచ్చినా ఇక ఆగకుండా వెళ్లేలా! - police focus on hyd traffic problem

కేబీఆర్​ పార్కు ట్రాఫిక్​ కష్టాలకు ఇక సెలవు​! - రూ.826 కోట్లతో ఆ ఆరు జంక్షన్ల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ - KBR PARK JUNCTIONs DEVELOPMENT

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details