ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందం, డ్రగ్స్ ఆ తర్వాత డబ్బు- విశాఖ హనీ ట్రాప్​ కేసులో సంచలన విషయాలు - Visakha Honey Trap Case

సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా యువతి మోసాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Visakha Honey Trap Case
Visakha Honey Trap Case (ETV Bharat)

Vizag Honey Trap Case Updates : ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్​లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్​గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్​ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. ఈ కోవలోకే విశాఖ ఘటన వెలుగులోకి రావడంతో ఈ కేసును పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు.

వలపు వలపన్ని పలువురిని మోసం చేసిన ఘటనలో మాయలేడి జాయ్‌ జమీమాను విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కిలేడీ జమీమా ఎత్తుగడలతో పాటు ఇతర కీలక అంశాలను వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన వారు, సమాజంలోని ప్రముఖులే లక్ష్యంగా నిందితురాలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.

సామాజిక మాధ్యమాలే టార్గెట్ ​:సామాజిక మాధ్యమాల వేదికగా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని సీపీ శంఖబ్రత బాగ్చీపేర్కొన్నారు. ఈ జాయ్‌ హనీట్రాప్‌ వెనుక పెద్ద రాకెట్‌ ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. తొలుత అందమైన అమ్మాయి ఫొటోలతో యువకులకు ఎర వేస్తారని తెలిపారు. ఆ తర్వాత బాధితులను మత్తు పదార్థాలకు అలవాటు చేస్తారని వివరించారు. ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీస్తారని సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.

ముఠా ఆ ఫోటోలను బాధితులకు చూపించి బెదిరిస్తారని సీపీ శంఖబ్రత బాగ్చీ వివరించారు. తమకు అడిగినంతా నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని చెప్పారు. దీంతో బాధితులు పరువు పోతుందన్న భయంతో వారు డబ్బులు చెల్లిస్తారని పేర్కొన్నారు. జాయ్ హనీ ట్రాప్​లో చాలా మంది చిక్కుకున్నారని తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. కానీ వారు బయటకు రావడం లేదన్నారు.

విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు జాయ్ జమీనా ఈ ముఠాతో చేతులు కలిపిందని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలియజేశారు. నిందితురాలని రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ ముఠా ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడిందో ఆరా తీస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.

ఇన్​స్టాలో వలపు వల - ఎన్నారైని రప్పించి కిడ్నాప్ చేసిన జమీనా - విచారణలో పోలీసులు షాక్ - Woman Kidnapped NRI in Visakha

హనీట్రాప్​లో పడి కొకైన్ స్మగ్లింగ్.. అడ్డంగా బుక్కైన వ్యక్తి.. రూ.28కోట్ల డ్రగ్స్ సీజ్

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details