తెలంగాణ

telangana

డీఎస్సీ పరీక్ష విధానం, సిలబస్​ మార్చలేదు అందుకే వాయిదా కుదరదు : సీఎం రేవంత్ - CM Revanth comments on group 1

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 7:16 PM IST

Updated : Jul 13, 2024, 8:01 PM IST

CM Revanth Reddy on Telangana DSC : డీఎస్సీ పరీక్ష విధానం, సిలబస్​ మార్చలేదు అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. నోటిఫికేషన్​లో ఇచ్చిన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే గ్రూపు-1 నోటిఫికేషన్​లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు. మళ్లీ మొదటికే పరీక్ష తంతు వస్తుందని వివరించారు.

CM Revanth Reddy on Telangana
CM Revanth Reddy on Telangana DSC (ETV Bharat)

CM Revanth Reddy on Group 1 Exam Ratio : నోటిఫికేషన్​ ఇచ్చిన ప్రకారమే గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. గ్రూప్​-1లో 1:100 నిష్పత్తిలో పిలవాలని కొందరు అంటున్నారని తెలిపారు. ఈ నిష్పత్తిలో పిలిస్తే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టత ఇచ్చారు. కానీ నోటిఫికేషన్​లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు. కొంతమంది చెప్పినట్లు 1:100 పిలిస్తే మళ్లీ గ్రూప్​-1 మొదటికి వస్తుందని వివరించారు. జేఎన్​టీయూలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్​, గ్రూపు-1, డీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ముందుకువెళ్తున్నామని వివరించారు. రెండేళ్ల క్రితం డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్​ వచ్చిందని అన్నారు. కానీ కొందరు డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష విధానం, సిలబస్​ మార్చలేదు అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్​ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన సమయానికి పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులకు ఇబ్బందులు వస్తాయని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్​ సెంటర్లు పెట్టుకున్న వారికే ఇబ్బందులు అని సీఎం రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. పరీక్షలు రాయనివారు నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదాలు వేయాలని కోరుతున్నారని విమర్శించారు. మార్చి 31లోపు ఖాళీలు తెప్పించి జూన్​ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 9లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్​ క్యాలెండర్​ తీసుకోస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​లో ఔట్​సోర్సింగ్​ సిబ్బందిని తీసుకువచ్చారని సీఎం రేవంత్​ రెడ్డి దుయ్యబట్టారు.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా విద్యాసంస్థలు మారకూడదు : 'విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. ఆర్థికభారంతో కూడిన సమస్యలు మా ప్రభుత్వంపై ఉన్నాయి. ఆర్థికభారంతో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్తున్నాం. విద్యాసంస్థలకు విశ్వాసం, నమ్మకం కల్పించాలని మేము ఇక్కడకు వచ్చాం. తప్పు చేయాలన్న ఆలోచన, తప్పు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన మాకు లేదు. తప్పులను సరిదిద్దాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది' అని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక - TGPSC GROUP 1 CANDIDATES SELECTION

గ్రూప్‌-1 మెయిన్స్ 1:100 ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి - హరీశ్‌రావుకు వినతిపత్రం - Group1 candidates plea to harishrao

Last Updated : Jul 13, 2024, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details