తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంచీకి రేవంత్ ​రెడ్డి - రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం

CM Revanth Reddy Jharkhand Tour : రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు సీఎం రేవంత్​రెడ్డి రాంచీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి తదితరులు ఉన్నారు.

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 12:25 PM IST

Updated : Feb 5, 2024, 12:39 PM IST

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy Jharkhand Tour :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఝార్ఖండ్​లో కొనసాగుతోంది. సబ్​కే లియే న్యాయ్ అనేదే ఈ యాత్ర సందేశమని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా యువత, మహిళలు, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తూ వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు రామ్‌గఢ్ మీదుగా రాంచీకి చేరుకోనున్నారు. అక్కడ ధుర్వలోని షాహీద్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ​ పాల్గొననున్నారు.

CM Revanth Reddy Visit Jharkhand : రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి రాంచీ బయల్దేరారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ దీపాదాస్ మున్షీ ఉన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో రేవంత్​రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం ఉండటంతో ఇవాళ రాత్రికే ఆయన తిరిగి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు (Bharat Jodo Nyay Yatra)శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​లోని తౌబాల్ జిల్లా​ నుంచి జనవరి 14న యాత్రను మొదలుపెట్టారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు సుమారు 6713 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుంది.

రాహుల్ గాంధీ కారుపై రాళ్లదాడి! కాంగ్రెస్ భిన్న ప్రకటనలు- ఏం జరిగింది?

మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్​సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సు, కాలినడకన కొనసాగతుంది. మొత్తం 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6713 కిలోమీటర్ల మేర సాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. యాత్రలో ఎక్కువ భాగం 1074 కిలో మీటర్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 11 రోజుల పాటు జరగనుంది.

Jharkhand Political Crisis 2024 :మరోవైపు ఝార్ఖండ్‌లో రాజకీయాలు రసవత్తంగా మారాయి. హేమంత్‌ సోరెన్ తర్వాత ఏర్పాటైన చంపయీ సోరెన్‌ ప్రభుత్వం నేడు బల పరీక్షకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రమే హైదరాబాద్‌ శిబిరంలోని ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌లో తమకు 47 మంది ఎమ్యెల్యేల బలముందని చంపయీ సోరెన్‌ చెబుతున్నారు.

'మీ బాధను అర్థం చేసుకున్నా- మణిపుర్​లో​ శాంతి నెలకొల్పుతా'- మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

'ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు- దర్శనం ఎవరు చేసుకోవాలో మోదీ నిర్ణయిస్తారా?'

Last Updated : Feb 5, 2024, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details