CM Chandrababu Review on Roads Repairs in AP :రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి నాణ్యతతో చేయాలని, నామమాత్రంగా చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. సంక్రాంతి కల్లా రోడ్ల మరమ్మతుల పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోయే రోడ్ల టోల్ విషయంలో ఏఏ వాహనాలుకు మినహాయింపు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు.
'ఏపీ రాజధాని నిర్మాణానికి మరో రూ.16 వేల కోట్ల రుణం'
అలా చేస్తే సహించేది లేదు : రోడ్ల మరమ్మతుల పనులపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈఎన్సీ నయిముల్లా, సీఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్లతో చేపట్టిన మరమ్మతుల పనులపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ప్రైవేటు సంస్థల ద్వారా నివేదికలు తెప్పించాలని సీఎం ఆదేశించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు
22 వేల 299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందని ఇప్పటికే 19 వందల 91 కిలోమీటర్ల మేర గుంతల్ని పూడ్చే పనులు పూర్తయినట్లు అధికారులు సీఎంకి వివరించారు. 14 వందల 47 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేయలేనంత ఘోరంగా ఉన్నాయని, వాటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటి కోసం 581 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రహదారులపై గుంతల్ని పూడ్చే పనుల్ని మొక్కుబడిగా చేపడితే సహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులను బ్లాక్లిస్ట్లో పెట్టాలన్నారు. సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు.