ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రం రూ.3,300 కోట్లు సాయం ప్రకటిందన్న ప్రచారం అవాస్తవం - నేడు తొలి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Change in Vijayawada After Floods

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 10:05 AM IST

Chandrababu Will Change Vijayawada: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల విపత్తు వల్ల విజయవాడలో వచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. వరదలకు ముందు, ఆ తర్వాత అనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Chandrababu Will Change Vijayawada
Chandrababu Will Change Vijayawada (ETV Bharat)

CM Chandrababu Will Change Vijayawada Before And After Floods :వరద విపత్తు వల్ల విజయవాడకొచ్చిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని డిజిటల్‌ సాధికారతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వరదలకు ముందు, ఆ తర్వాత అనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఇతర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. నష్టంపై ఇవాళ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని ఆయన వెల్లడించారు.

డిజిటల్‌ సాధికారతను పెంచుతాం : హుద్‌హుద్‌ తుపాను తర్వాత విశాఖ ముఖచిత్రం సమూలంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు విజయవాడ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. విపత్తుని అవకాశంగా మార్చుకుని డిజిటల్‌ సాధికారతను పెంచుతామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరిస్తున్నానన్న సీఎం బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

బుడమేరుకు మూడు బుంగలు వస్తే గుర్తు పట్టలేని గత ప్రభుత్వ వ్యక్తులు. అది అప్పట్లో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వచ్చేదికాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారే తప్ప వాళ్లలో తప్పు జరిగిందనే బాధలేదు. బుడమేరును మొత్తం ఆక్రమించేసి, ప్రైవేటుగా కూడా కబ్జాలు చేసేశారు. దాని వల్ల నీళ్లు పోలేని పరిస్థితి రావడంతో విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. - చంద్రబాబు , రాష్ట్ర ముఖ్యమంత్రి.

బుడమేరుకు 3 గండ్లు పడితే గుర్తించలేని గత పాలకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారన్న ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం తమ చేతుల్ని కట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP

పరిస్థితులు చక్కదిద్దాకే ఇంటికి తిరిగి వెళ్తా : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకోడానికి కేంద్రం రూ.3 వేల 300 కోట్లు సాయం ప్రకటించిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. వరద నష్టంపై ఇంకా నివేదిక పంపకుండా సాయం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి ఇవాళ తొలి నివేదిక పంపుతున్నామని వెల్లడించారు. మరోవైపు బాధితుల రుణాల రీషెడ్యూల్‌పై బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దాకే తిరిగి ఇంటికి వెళ్తానని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు వినాయక చవితిని కూడా అక్కడే జరుపుకుంటానన్నారు. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. పండుగ ఇక్కడ జరుపుకుంటే ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడన్నారు.

విపత్తు నుంచి బయటపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా - ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సీఎం చంద్రబాబు - CM CBN on Flood Relief Measures

ABOUT THE AUTHOR

...view details