తెలంగాణ

telangana

ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ - SDRF Funds to Telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 3:12 PM IST

SDRF Funds To Telangana For Flood Affected Areas : తెలంగాణలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వినియోగానికి కేంద్రం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో వానలు సృష్టించిన బీభత్సంపై కేంద్రమంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాను కలిసి నిధుల వినియోగంపై విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

Central Ministers To Amit Shah on SDRF Funds to Telangana
Central Ministers To Amit Shah on SDRF Funds to Telangana (ETV Bharat)

Central Ministers To Amit Shah on SDRF Funds to Telangana :తెలంగాణలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధుల వినియోగం, మంజూరుపై రాష్ట్ర కేంద్ర మంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. దానికి అమిత్​ షా సానుకూలంగా స్పందించినట్లు బండిసంజయ్ తెలిపారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశిష్​ గవాయ్​ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సానుకూలంగా స్పందించిన అమిత్​ షా : అకౌంటెంట్​ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం వద్ద రూ.1,345కోట్ల ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. కాగా జాతీయ విపత్తుల నిధిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వద్ద ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌​ నిధులను వాడుకోవాలని సూచించినట్లు తెలిపారు.

యూసీ సమర్పిస్తే నిధులు విడుదల చేస్తాం :రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోవడంవల్లే ఈ ఏడాది జూన్​లో రావాల్సిన రూ.208.40 కోట్లను విడుదల చేయలేదని కేంద్రం పేర్కొంది. యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది.

"జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదు - ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఉన్న రూ.1,345 కోట్లను వినియోగించాలి" - Kishan Reddy On Flood Relief Fund

ఏరియల్ సర్వే : అలాగే రాష్ట్రంలో ఎంత మేరకు విపత్తు జరిగిందో తెలుసుకోడానికి ఏరియల్ సర్వే చేయించాలని కేంద్రమంత్రి అమిత్​ షాను కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు, తెలుగు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేయించడానికి కేంద్రం సిద్ధమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం బృందం సర్వే చేయనుంది.

Telangana BJP Two Teams For To Check Flood Affected Areas : వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి బీజేపీ ఇద్దరు నేతలతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈనెల 6తేదీన రెండు బృందాలు వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో సంకినేని వెంకటేశ్వరరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్, ములుగు ప్రాంతాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రామారావు పాటిల్ పర్యటిస్తారని వివరించారు.

వరద బాధితుల కోసం గవర్నర్ రూ. 30 లక్షల సాయం

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

ABOUT THE AUTHOR

...view details