తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయాలకు అతీతంగా అలయ్​ బలయ్​ కార్యక్రమం - ముఖ్య అతిథిగా గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో ప్రారంభమైన అలయ్​ బలయ్​ కార్యక్రమం. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ. రాజకీయాలకు అతీతంగా అలయ్​ బలయ్.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Alai Balai Program in Hyderabad
Alai Balai Program in Hyderabad (ETV Bharat)

Alai Balai Program in Hyderabad : ప్రతి ఏటా దసరా మరుసటి రోజు నిర్వహించే అలయ్​ బలయ్​ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానం సర్వం సిద్ధమైంది. హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005లో అలయ్​ బలయ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అలయ్​ బలయ్​ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అలయ్​ బలయ్​లో పాల్గొననున్న ప్రముఖులు : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీల నేతలు అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ వంటలు తయారీ : అలయ్ బలయ్ కి వచ్చే అతిథులకు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను రుచి చూపించనున్నారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి అనేక తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. మరో వైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, కళారూపాలను అలయ్ బలయ్ లో ప్రతిబింబించనున్నారు. 18 ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఘనంగా జరుపుకుంటున్న అలయ్ బలయ్ సమ్మేళనాన్ని ఈ ఏడాది కూడా విజయవంతం చేయాలని దత్తాత్రేయ కుమార్తె అలయ్ బలయ్ చైర్మన్ బండారు విజయ లక్ష్మీ పిలుపునిచ్చారు.

'అలయ్​ బలయ్'​కు రండి - సీఎం రేవంత్ రెడ్డికి దత్తాత్రేయ ఆహ్వానం

హైదరాబాద్​లో ఘనంగా అలయ్​ బలయ్​.. హాజరైనా వివిధ పార్టీ నాయకులు

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details