ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 12:27 PM IST

ETV Bharat / state

ఎన్టీటీపీఎస్​లో మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలు - వివరాలు ఇవ్వాలని మంత్రుల ఆదేశం - Accident at Ibrahimpatnam NTTPS

Accident in Ibrahimpatnam NTTPS: ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆశా తీశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Accident in Ibrahimpatnam NTTPS :ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో బూడిద నిల్వ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. వేడి బూడిద తాకిడికి ఒక ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అధికారులు తరలించారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది :ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. బాయిలర్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం జరగటం దురదృష్టకరమని అన్నారు. ఆస్పత్రి సిబ్బందితో ఫోన్లో మాట్లాడిన మంత్రి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి :ఎన్టీటీపీఎస్ ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. గాయపడిన కార్మికుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై అధికారులను మంత్రి నివేదిక కోరారు.

ప్రభుత్వ జోక్యంతో సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం - Ex gratia to victims

ABOUT THE AUTHOR

...view details