తెలంగాణ

telangana

శ్రీలంక టూర్​​ జట్టు ప్రకటన - వన్డే కెప్టెన్​గా రోహిత్​, టీ20 సారథి​ ఎవరంటే? - TeamIndia Squad for SriLanka 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 7:46 PM IST

TeamIndia Squad for SriLanka 2024 : టీ20తో పాటు వన్డే సిరీస్‌ కోసం భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. తాజాగా ఈ సిరీస్​ కోసం బీసీసీఐ టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది.

source Associated Press
TeamIndia Squad for SriLanka 2024 : (source Associated Press)

TeamIndia Squad for SriLanka 2024 :జులై 27 నుంచి భారత్‌, శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌ సిరీస్‌లు జరగనున్నాయి. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ . కొత్త ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ జట్టు ఎంపికపై సుదీర్ సమాలోచనలు జరిపిన తర్వాత జట్టును అనౌన్స్​ చేశారు. అయితే ఈ సిరీస్​కు రోహిత్‌ శర్మ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో అతడికే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20లకు రోహిత్​ రిటైర్మెంట్​ ప్రకటించడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ను టీ20 టీమ్​లకు సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఈసారి జట్టులో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్​కు అవకాశం కల్పించారు.

టీ20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హుబ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్​ సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), గిల్‌(వైస్ కెప్టెన్), కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌(వికెట్ కీపర్), రిషభ్‌(వికెట్ కీపర్), శ్రేయస్‌, శివమ్‌, కల్దీప్‌, సిరాజ్‌, వాషింగ్టన్‌, అర్ష్‌దీప్‌, రియాన్‌, అక్షర్‌, ఖలీల్‌, హర్షిత్‌ రాణా

షెడ్యూల్​ - పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. కొలంబో వేదికగా ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

గంభీర్ రిక్వెస్ట్​తో - హార్దిక్ పాండ్య వ్యక్తిగత కారణాలతో లంక జరగబోయే వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇక కొత్త హెడ్​ కోచ్‌ గంభీర్‌ రిక్వెస్ట్ చేయడం వల్ల సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్ల శ్రేయస్ అయ్యర్​ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఈ సిరీస్​తో పునరాగమనం చేయడం విశేషం.

అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ - ఆ ఇద్దరు స్టార్స్​ను వెనక్కినెట్టి! - Kohli Most Valued Celebrity

లండన్​ స్ట్రీట్స్​లో విరాట్- కొడుకు అకాయ్​తో చక్కర్లు- వీడియో వైరల్ - Virat Son Akay Kohli

ABOUT THE AUTHOR

...view details