Wriddhiman Saha Retirement :టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్, 40ఏళ్ల వృద్ధిమాన్ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆడుతున్న రంజీనే తన కెరీర్లో ఆఖరిదని, ఇకపై ఐపీఎల్ బరిలోనూ దిగనని వెల్లడించాడు.
'ప్రతిష్ఠాత్మకమైన క్రికెట్ జర్నీలో ఇదే నా చివరి రంజీ ట్రోఫీ. ఈ రంజీల్లో బంగాల్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. రిటైర్ అయ్యే ముందు కేవలం రంజీలోనే ఆడుతాను. ఈ సీజన్ గుర్తుండిపోయేలా చేసుకుంటా' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో వృద్ధిమాన్ తన సొంత రాష్ట్రమైన బంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇక సుదీర్ఘ ఫార్మాట్కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టుల్లో సాహానే వికెట్ కీపింగ్కు తొలి ఛాయిస్గా ఉన్నాడు. అతడి కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు. అయితే రానురాను ఫామ్తో ఇబ్బందులు పడడం వల్ల సాహా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ జట్టులోకి రావడం వల్ల సాహాకు టీమ్ఇండియాలో చోటు దక్కడం కష్టమైంది. 2021లో సాహా న్యూజిలాండ్పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.