Shah Rukh Khan- Kavya Maran Net Worth:సమ్మరీ: సన్రైజర్స్ హైదరాబాద్ అనగానే కావ్యా మారన్, కోల్కతా పేరు వినగానే షారుఖ్ గుర్తు వస్తారు. రానున్న ఐపీఎల్కి ఇద్దరూ తమ టీమ్లను దాదాపుగా కొనసాగించే యోచనలో ఉన్నారు. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు రిచ్ తెలుసా?
ఐపీఎల్ 2024 సీజన్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) విన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రన్నర్గా నిలిచాయి. ఈ రెండు ఫ్రాంచైజీలకు బలమైన జట్లు లభించాయి. దీంతో ఈ టీమ్లనే దాదాపు కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇటీవల ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ సెక్రెటరీ జై షా నేతృత్వంలో జులై 31న జరిగిన సమావేశంలో ఇదే అభిప్రాయం తెలియజేశాయి.
సన్రైజర్స్ సహ యజమాని కావ్య మారన్, కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ ఎక్కువ మంది ప్లేయర్లను ఉంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. కావ్య, షారుఖ్ టీమ్ని కంటిన్యూ చేయాలని పట్టుబట్టడం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది వీరిద్దరిలో ఎవరు అత్యధిక ధనవంతులు? అని కూడా సెర్చ్ చేస్తున్నారు.
RTM కార్డ్ ఆప్షన్లు
గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై కావ్య మారన్ సంతృప్తి చెందింది. 2025 సీజన్లో కోర్ యూనిట్ను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల సమావేశంలో ఆమె ఇదే వాదన వినిపించారు. కనీసం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి లేదా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డులను వేలంలో ఉపయోగించడానికి జట్లను అనుమతించాలని కోరారు. నాలుగు రిటెన్షన్లు, రెండు రైట్ టూ మ్యాచ్ ఆప్షన్లను ఆమె సూచించింది. కేవలం రిటెన్షన్లు మాత్రమే అనుమతిస్తే, ఫ్రాంచైజీలు సైడ్ కాంట్రాక్ట్లను ఆశ్రయించవచ్చని, RTM కార్డ్లు ఫైనాన్షియల్ !ట్రాన్స్పెరెన్సీని ప్రోత్సహిస్తాయని మారన్ హైలైట్ చేశారు.
షారుక్ ఖాన్ ఆగ్రహం!
!కేకేఆర్, హైదరాబాద్ 7- 8 మంది ఆటగాళ్లను ఉంచాలని కోరుకున్నాయని అయితే పంజాబ్సహా ఇతర ఫ్రాంచైజీలు తక్కువ రిటెన్షన్లు ఉండాలని తెలిపాయని సమాచారం. దీంతో సమావేశంలో పంజాబ్ కింగ్స్ సహ- యజమాని నెస్ వాడియా, షారుక్ ఖాన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.