తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింగిల్ రన్​తో పంత్ సెంచరీ మిస్- 90ల్లో ఎన్నిసార్లు ఔటయ్యాడంటే?

టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్​తో టెస్టులో 1 పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరి టెస్టుల్లో 90ల్లో ఔటవ్వడం పంత్​కు ఇది ఎన్నోసారి అంటే?

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Rishabh Pant 90s In Test
Rishabh Pant 90s In Test (Source: Associated Press)

Rishabh Pant 90s In Test :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్​తో తొలి టెస్టులో ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 20 పరుగులకే పంత్, రెండో ఇన్నింగ్స్​లో అద్భుతంగా రాణించాడు. కానీ, 99 వ్యక్తిగత పరుగుల వద్ద పంత్ ఓ రూర్కీ బౌలింగ్​లో క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. దీంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పంత్ ఔట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.

అయితే టెస్టు క్రికెట్​లో 90'ల్లో పెవిలియన్ చేరడం పంత్​కు ఇది తొలిసారి కాదు. 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్, ఇప్పటివరకు 62 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్​కు దిగాడు. ఇందులో 90ల్లో ఔట్ అవ్వడం పంత్​కు ఇది ఏడోసారి. పంత్ ఇప్పటివరకు 93, 97, 96, 92, 92, 91, 99 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక సార్లు 90ల్లో ఔటైన భారత ఆటగాళ్లలో మూడో ప్లేయర్​గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజం సచిన్ తెందూల్కర్ అందరికంటే ఎక్కువగా 10సార్లు 90ల్లో పెవిలియన్ చేరాడు.

టెస్టుల్లో 90ల్లో అత్యధికసార్లు ఔటైన టీమ్ఇండియా ప్లేయర్లు

సచిన్ తెందూల్కర్ 10
రాహుల్ ద్రవిడ్ 09
రిషభ్ పంత్ 07
సునీల్ గావస్కర్ 05
ఎమ్ ఎస్ ధోనీ 05
వీరేంద్ర సెహ్వాగ్ 05

రెండో బ్యాటర్​గానూ
అయితే పంత్ ఈ మ్యాచ్​తో 99 పరుగుల వద్ద ఔటైన టీమ్ఇండియా రెండో వికెట్​ కీపర్​గానూ నిలిచాడు. పంత్​ కంటే ముందు మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ 99 పరుగుల ఔటై, పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓవరాల్​గా టెస్టుల్లో సింగిల్ రన్​తో సెంచరీ చేజార్చుకున్న నాలుగో వికెట్ కీపర్ బ్యాటర్​గా పంత్ నిలిచాడు.

99 పరుగుల వద్ద ఔటైన వికెట్ కీపర్లు

  • బ్రెండన్ మెక్​కల్లమ్ (న్యూజిలాండ్) vs శ్రీలంక- 2025
  • ఎమ్​ఎస్ ధోనీ (భారత్) vs ఇంగ్లాండ్ - 2012
  • జానీ బెయిర్​ స్టో (ఇంగ్లాండ్) vs సౌతాఫ్రికా - 2017
  • రిషభ్ పంత్ (భారత్) vs న్యూజిలాండ్ -2024

కాగా, రెండో ఇన్నింగ్స్​లో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ (150 పరుగులు), పంత్ (99 పరుగులు), విరాట్ కోహ్లీ (70 పరుగులు), రోహిత్ శర్మ (52 పరుగులు) రాణించారు. దీంతో టీమ్ఇండియా 106 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు

పంత్ ఈజ్ బ్యాక్- సెకండ్ ఇన్నింగ్స్​కు రెడీ!

ABOUT THE AUTHOR

...view details