తెలంగాణ

telangana

దిల్లీ షాకింగ్ డెసిషన్- పాంటింగ్​పై వేటు- కొత్త కోచ్​గా సీనియర్! - Ricky Ponting Delhi Capitals

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 7:48 AM IST

Ricky Ponting Delhi Capitals: దిల్లీ క్యాపిటల్స్ హెడ్​కోచ్, వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్ రికీపాంటింగ్​పై ఆ జట్టు యాజమాన్యం వేటు వేసింది. పాంటింగ్​ను హెడ్​కోచ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Ricky Ponting Delhi Capitals
Ricky Ponting Delhi Capitals (Source: ANI)

Ricky Ponting Delhi Capitals:దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్​కోచ్ రికీ పాంటింగ్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. '7 సీజన్​ల తర్వాత దిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్​ను వదులుకుంటుంది. పాంటింగ్​తో జర్నీ అద్భుతం. థాంక్యూ కోచ్' అంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చింది. దీంతో దిల్లీతో పాంటింగ్ బంధం ముగిసినట్లైంది.

అయితే 2018లో రికీపాంటింగ్ దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చేరాడు. అప్పట్నుంచి దిల్లీకి హెడ్​ కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన పాంటింగ్ 2024 ఐపీఎల్​ దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఈ 7సీజన్లలో దిల్లీని ఛాంపియన్​గా నిలపడంలో పాంటింగ్ విఫలమయ్యాడు. కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్​లోనే జట్టు ఆఖరి స్థానంలో నిలవగా, 2019లో ప్లేఆఫ్స్, 2020లో ఫైనల్​కు చేరింది. ఆ తర్వాత 2021లో ప్లేఆఫ్స్​కు చేరిన దిల్లీ, 2022, 2023, 2024 సీజన్​లలో టాప్-4లో నిలవలేకపోయింది.

కాగా, ప్రస్తుతం దిల్లీకి డైరెక్టర్‌గా ఉన్న సౌరభ్‌ గంగూలీ హెడ్ కోచ్‌ పదవి దక్కే ఛాన్స్ ఉంది. దీనికి గంగూలీ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. కొత్త కోచ్ గురించి త్వరలోనే ప్రకటన రావచ్చు. దీనిపై గంగూలీ కూడా స్పందించాడు. '2025 ఐపీఎల్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఈసారి దిల్లీ క్యాపిటల్స్‌ ఛాంపియన్​గా నిలవాలని కోరుకుంటున్నా. భారత్‌కు చెందిన వారిని హెడ్​ కోచ్‌గా నియమించాలని మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతా. నేను హెడ్ కోచ్‌ అవ్వాలనుకుంటున్నాను. ఈసారి వేలంలో చురుగ్గా పాల్గొనాలి. కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని గంగూలీ ఓ సందర్భంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇక జట్టు అసిస్టెంట్ కోచ్​గా మాత్రం ప్రవీణ్‌ ఆమ్రేనే కొనసాగే ఛాన్స్ ఉంది.

కోల్​కతా ఫ్రాంచైజీలో కూాడా మార్పులు:డిఫెండింగ్ ఛాంప్ కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టులో మార్పులు జరగనున్నాయి. గత సీజన్​లో కేకేఆర్​కు మెంటార్​గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, తాజాగా టీమ్ఇండియా హెడ్​కోచ్​గా ఎంపిక అవ్వడం వల్ల జట్టుకు దూరం కానున్నాడు. దీంతో టీమ్​కు కొత్త మెంటార్​ను కేకేఆర్ యాజమాన్యం అన్వేషిస్తోంది.

రికీ పాంటింగ్ క్రికెట్​ బ్యాట్​ కలెక్షన్స్​ - గ్యారేజీలో 1000కుపైగా! - IPL 2024

దిల్లీ ఫ్యాన్స్​కు షాక్- పంత్​పై ఓ మ్యాచ్ నిషేధం - IPL 2024

ABOUT THE AUTHOR

...view details