తెలంగాణ

telangana

'అలా జరగడం నచ్చలేదు - ఒత్తిడికి గురయ్యాను!' - మూడో పతకం మిస్​ అవ్వడంపై మను బాకర్ - Paris Olympics 2024

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 3:26 PM IST

Updated : Aug 3, 2024, 4:15 PM IST

Paris Olympics 2024 Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్​ 2024లో భారత్ షూటర్ మను బాకర్​కు త్రుటిలో మూడో పతకం మిస్ అయ్యింది. దీంతో ఆమె కాస్త బాధపడింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Paris Olympics 2024 Manu Bhaker (source Associated Press)

Paris Olympics 2024 Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్​ 2024లో భారత్ షూటర్ మను బాకర్​కు త్రుటిలో మూడో పతకం మిస్ అయ్యింది. తాజాగా శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్​లో మను 28 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఈవెంట్​లో దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ గోల్డ్​ మెడల్​ సాధించింది.

అయితే ఈ పారిస్ ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు షూటింగ్ ఈవెంట్‌లలో మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. మూడో పతకం కోసం ఇవాళ పోటీపడగా అది నెరవేరలేదు. అయినా కూడా స్వాత్రంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్​ సాధించిన తొలి భారత అథ్లెట్​గా నిలిచింది.

ఇక తాజా ఈవెంట్​ ముగిశాక ఫలితం గురించి మను మాట్లాడింది. "రెండు కాంస్య పతతాలు సాధించడం సంతోషంగా ఉంది కానీ, చివరి ఈవెంట్​లో నాలుగో స్థానానికి పరిమితమైనందుకు బాధగా ఉంది" అని పేర్కొంది. తన తదుపరి లక్ష్యం 2028లో జరగబోయే లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్​ అని పేర్కొంది.

"నేను బాగా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆ తర్వాత నా వంతుగా కామ్​గా, పీస్​గా ఉంటూ బెస్ట్ ఔట్​ఫుట్​ ఇవ్వడానికి​ ట్రై చేశాను. కానీ అది సరిపోలేదు. ఈ ఒలింపిక్స్​ నాకు ఎంతో మంచి అనుభవంగా మారింది. అయితే ఎప్పుడూ మరో ఒలింపిక్స్ ఉంటుంది కాబట్టి ఇక దాని కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం రెండో మెడల్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది కానీ ప్రస్తుతం ఈ విభాగంలో కోల్పోవడం కాస్త బాధగానే ఉంది. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం నాకు నచ్చలేదు. అని చెప్పింది.

మను ఈ ఒలింపిక్స్​లో ఇప్పటికే రెండు మెడల్స్​ను సాధించడం వల్ల మూడో పతకం కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన మను తన చుట్టూ ఉన్న భారీ అంచనాలు, ప్రచారాల వల్ల తన మనసు, మెదడు పరధ్యానం చెందలేదని, అన్నింటినీ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసి కేవలం తన లక్ష్యంపైనే గురిపెట్టినట్లు పేర్కొంది.

"నిజంగా చెబుతున్నాను నేను సోషల్ మీడియా జోలికి కూడా పోలేదు. నా ఫోన్ కూడా చెక్​ చేయలేదు. కాబట్టి బయట ఏం జరుగుతుందో అస్సలు తెలీదు. నా వంతుగా బెస్ట్​ ఔట్​ఫుట్ పెర్​ఫార్మెన్స్​ ​ మాత్రమే ట్రై చేస్తున్నానని తెలుసు. చాలా ఈవెంట్లలో నేను మంచి ప్రదర్శన చేశాను. కాకపోతే ప్రస్తుత ఈవెంట్​లో మాత్రమే చేయలేకపోయాను. ప్రస్తుతానికి నా మ్యాచ్​​ అయిపోయింది. ఓకే ఇక నెక్ట్స్​ టైమ్ చూద్దాం అనే ఆలోచనలో ఉన్నాను." అని చెప్పుకొచ్చింది.

"తెరవెనుక చాలా హార్డ్​వర్క్​ కొనసాగింది. నేను ఇక్కడ ఉన్నాను అనేదే మీరు చూస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు నా వెనక ఉండి ఎంతో కష్టపడ్డారు కాబట్టే నేను ఈ పోడియంకు చేరుకోగలిగాను. అందుకే భారతదేశం పతకం సాధించగలిగింది. ఏదేమైనా నా జర్నీలో నన్నెంతగానో సపోర్ట్ చేసే ఓ టీమ్​ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను." అని మను వెల్లడించింది.

ఆమె వల్లే ఎన్నో చీకట్లను చీల్చుకుని వచ్చా - "నా కోసం అన్నింటినీ త్యాగం చేసిన అమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆమె వల్లే ఎన్నో చీకట్లను చీల్చుకుని బయటకు వచ్చాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అమ్మ. నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి. దీర్ఘాయుస్సు కలిగి ఉండాలని కోరుకుంటున్నా." అని మను బాకర్‌ పేర్కొంది.

జస్ట్ మిస్​- చివరిక్షణంలో మెడల్ కోల్పోయిన మను - Paris Olympics 2024

లైవ్‌ Paris Olympics: ఆర్చరీలో క్వార్టర్స్​కు దీపిక- రౌండ్ 16లో గ్రాండ్ విక్టరీ - Paris Olympics 2024

Last Updated : Aug 3, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details