తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్లకు శిందే సత్కారం- కెప్టెన్​తో సీఎం చిట్​చాట్ - Rohit Sharma World Cup 2024

Rohit Sharma Eknath Shinde: టీ20 వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిందేను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కెప్టెన్ రోహిత్​తోపాటు సూర్యకుమార్, దూబే, జైశ్వాల్​ కూడా సీఎంను కలిశారు.

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 5:10 PM IST

Updated : Jul 5, 2024, 5:32 PM IST

Rohit Sharma Eknath Shinde
Rohit Sharma Eknath Shinde (Source: ANI)

Rohit Sharma Eknath Shinde:టీ 20 ప్రపంచకప్‌ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను కలిశారు. ముంబయిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో టీ20 ఛాంపియన్లు శిందేను కలిశారు. భారత క్రికెటర్లకు స్వాగతం పలికిన సీఎం ప్లేయర్లను అభినందించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ప్రపంచకప్ విశేషాలను కెప్టెన్ రోహిత్​ను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచకప్‌లో తమ అనుభవాలు, స్వదేశంలో లభించిన అపూర్వ స్వాగతం గురించి ఏక్‌నాథ్‌ శిందేకు వివరించారు. అనంతరం సీఎం శిందే ఆటగాళ్లను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

వీళ్లే ఎందుకు?కెప్టెన్ రోహిత్ సహా సూర్యకుమార్, శివమ్ దూబే యశస్వీ జైస్వాల్ మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు. వీరంతా దేశవాళీ క్రికెట్​లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రోహిత్, సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబయికి చెందినవారు కాగా, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి ముంబయికి వచ్చి స్థిరపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో భేటీ ముగిశాక ప్లేయర్లంతా శిందేతో కలిసి విధాన్ భవన్​కు వెళ్లారు.

విధాన్ భవన్​లో సత్కారం:విధాన్ భవన్​లోనూ ప్లేయర్లకు గ్రాండ్ వెల్​కమ్ దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్లేయర్లను అధికారికంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం శిందేతోపాటు, డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడణవీస్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ మరాఠీలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. 'ముంబయి చా రాజా రోహిత్ శర్మ' అంటూ ఎమ్మెల్యేలు స్లోగన్స్​ ఇచ్చారు. ఇక సీఎం శిందేకు రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు.

నిన్న ప్రధానితో భేటీ
2024 టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి, గురువారం స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్‌ఇండియాకు దిల్లీ ఎయిర్​పోర్ట్​లో అపూర్వ స్వాగతం లభించింది. బార్బడోస్‌ నుంచి స్వదేశానికి వచ్చిన రోహిత్‌ సేన ముందు ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మోదీ, టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. టీ20 కప్పు గెలవడంపై ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

టీమ్‌ఇండియాతో మోదీ స్పెషల్‌ చిట్‌చాట్‌ - ఏం ప్రశ్నలు అడిగారో తెలుసా? - Teamindia Modi Chit Chat

8 నెలల్లో రెండు సార్లు భేటీ - అది ఇది ఒకటి కాదు గురూ! - T20 World Cup 2024

Last Updated : Jul 5, 2024, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details