తెలంగాణ

telangana

ETV Bharat / sports

లక్ష్యసేన్​కు ఊరట - FIR విషయంలో కర్ణాటక హైకోర్టు నిరాకరణపై సుప్రీంలో స్టే - LAKSHYA SEN AGE CONTROVERSY

లక్ష్యసేన్​కు ఊరట - FIR విషయంలో కర్ణాటక హైకోర్టు నిరాకరణపై సుప్రీంలో స్టే

Karnataka High Court Rejects Lakshya Sens Plea
Lakshya Sen (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 25, 2025, 4:06 PM IST

Karnataka High Court Rejects Lakshya Sens Plea : బర్త్​ సర్టిఫికేట్లను నకిలీ చేశారంటూ స్టార్ షట్లర్ లక్ష్య సేన్, అతని కుటుంబం అలాగే కోచ్ విమల్ కుమార్‌పై నమోదైన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయడానికి చేసిన అభ్యర్థనను తాజాగా కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

కోర్టును ఆశ్రయించిన లక్ష్యసేన్
బెంగళూరులోని ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ లక్ష్యసేన్, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ఉమా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఎఫ్ఐఆర్​లను కొట్టేయలేమని తీర్పునిచ్చారు.

'లక్ష్యసేన్​ను వేధించడానికి కేసులు'
లక్ష్యసేన్​ను వేధించడానికే ఫిర్యాదుదారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదించారు. లక్ష్యసేన్​పై ఫిర్యాదు నిరాధారమైనదని ఆరోపించారు. అయితే, కంప్లైంట్ చేసిన వ్యక్తి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారని, ఈ దశలో కేసును కొట్టివేయడం సరికాదంటూ హైకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లక్ష్యసేన్ తరఫు న్యాయవాదులు.

ఇదీ జరిగింది :
బ్యాడ్మింటన్ టోర్నమెంట్లకు అర్హత సాధించడానికి, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి లక్ష్య సేన్ తన వయసును రెండున్నర ఏళ్లు తగ్గించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్​కు తప్పుడు సమాచారంతో ఫేక్​ ఏజ్​ సర్టిఫికెట్​ను సమర్పించాడని అని గోవియప్ప నాగరాజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా లక్ష్యసేన్ వయసుకు సంబంధించిన అధికారిక పత్రాలను పొందారు. దీని ఆధారంగా ఏసీఎంఎం కోర్టు హైగ్రౌండ్స్ పోలీసులను లక్ష్యసేన్, ఇతరులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఎఫ్​ఐఆర్​ను కొట్టేయాలని లక్ష్యసేన్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.

లక్ష్యసేన్ పెర్ఫామెన్స్​పై దిగ్గజ క్రికెటర్ ఫైర్​ - రోహిత్ శర్మ స్టైల్​లో కామెంట్స్​ - Sunil Gavaskar Paris Olympics 2024

రూ.72.03 కోట్లు ఖర్చు చేస్తే పతకాలు సున్నా - ఒలింపిక్స్​లో నిరాశపరిచిన బ్యాడ్మింటన్​ - Paris Olympics 2024 Badminton

ABOUT THE AUTHOR

...view details