తెలంగాణ

telangana

ETV Bharat / sports

గిల్, విరాట్, అయ్యర్ మెరుపులు- ఇంగ్లాండ్​కు భారీ టార్గెట్ - IND VS ENG 3RD ODI

గిల్, విరాట్, అయ్యర్ మెరుపులు- ఇంగ్లాండ్​కు భారీ టార్గెట్

India vs England
India vs England (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 12, 2025, 5:20 PM IST

Ind vs Eng 3rd ODI :ఇంగ్లాండ్​తో మూడో వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శుభ్​మన్ గిల్ (112 పరుగులు) సెంచరీతో అలరించాడు. విరాట్ కోహ్లీ (52 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (78 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కే ఎల్ రాహుల్ (40 పరుగులు) ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2, జో రూట్, మహ్మూద్, గస్ అట్కిసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. గతమ్యాచ్ సెంచరీ హీరో కెప్టెన్ రోహిత్ శర్మ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. వుడ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయి, కీపర్​కు చిక్కాడు. ఆ తర్వాత విరాట్​తో కలిసి గిల్ భాగస్వామ్యం నిర్మించాడు. రన్​రేట్ 6కు తగ్గకుండా క్రమంగా పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.

హాఫ్ సెంచరీ తర్వాత విరాట్ (52) 18.6 ఓవర్ వద్ద ఔటయ్యాడు. రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 116 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్​తో శ్రేయస్ అయ్యర్ జతకట్టాడు. అయ్యర్ కూడా అర్థ శతకంతో రాణించాడు. హార్దిక్ పాండ్య (17 పరుగులు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వాషింగ్టన్ సుందర్ (14), అక్షర్ పటేల్ (13), హర్షిత్ రాణా (13) పరుగులు చేశారు. ఆఖరి బంతికి అర్ష్​దీప్ సింగ్ (2) రనౌట్​తో భారత్ ఆలౌటైంది.

గ్రీన్ బ్యాండ్స్ ధరించిన ఆటగాళ్లు
అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు బీసీసీఐ ముందడుగు వేసింది. ఈ క్రమంలో మూడో వన్డేలో ఇంగ్లాండ్- టీమ్ఇండియా ప్లేయర్స్ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి దిగారు. బీసీసీఐ తలపెట్టిన 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్'కు మద్దతుగా రెండు జట్లూ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్​లు ధరించాయి.

గిల్ ఆల్​టైమ్ రికార్డ్- ప్రపంచంలోనే తొలి బ్యాటర్​గా!

క్లీన్​స్వీప్​పై టీమ్ఇండియా గురి! - మూడో వన్డేలో ఆ స్టార్ పేసర్ రీ ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details