IND Vs AUS Border Gavaskar Trophy 2nd Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు (పింక్ బాల్) తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ బ్యాటర్ నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37, శుభ్మన్ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్ పంత్ 21 పరుగులు మాత్రమే చేశారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో పాటు బోలాండ్, కమిన్స్ చెరో 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
మ్యాచ్ ఎలా సాగిందంటే? -ఈ గులాబీ టెస్టులో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.
మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఇన్నింగ్స్ తొలి బాల్కే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.