Gautam Gambhir On Dressing Room Rumors : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని గతంలో వార్తలు వచ్చాయి. సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో హెచ్ కోచ్ గంభీర్కు విభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమ్ ఇండియా ఓడిపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20లో టీమ్ ఇండియా గెలిచిన అనంతరం గంభీర్ ఈ విషయల గురించి క్లారిటీ ఇచ్చారు.
"టీమ్ఇండియా ఆటగాళ్లు చాలా కాలం నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్నారు. నెల క్రితం టీమ్ఇండియా గురించి రెండు పుకార్లు వచ్చాయి. భారత క్రికెట్ అంటే అదే. పరిస్థితులు బాగాలేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో జరిగే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఫలితాలు అనుకూలంగా మారితే పరిస్థితులు మారుతాయి." అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
హై రిస్క్తోనే హై రివార్డ్
హై-రిస్క్, హై -రివార్డ్ విధానాన్ని అనుసరించి టీ20 మ్యాచ్ ల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో క్రమం తప్పకుండా 250-260 రన్స్ సాధించడమే తమ లక్ష్యమని తెలిపాడు. ఈ ఆటలో తాము ఓడిపోతామని భయపడకూడదని అనుకుంటున్నామని పేర్కొన్నాడు.