తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను వెంకీ మామని కాదు, కానీ ఆ మూవీ గురించి విన్నా'- మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ - SANKRANTIKI VASTHUNNAM

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై మాజీ క్రికెటర్ కామెంట్స్- నేను ఆ వెంకీని కాదంటూ నెటిజన్​కు రిప్లే

Cricketer Venkatesh Prasad
Cricketer Venkatesh Prasad (Source : Venkatesh Prasad X, ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Jan 19, 2025, 8:06 PM IST

Cricketer Venkatesh Prasad On Sankrantiki Vasthunnam :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్​గా ఉంటాడు. తరచూ ఎక్స్​ (ట్విట్టర్) వేదికగా ఫ్యాన్స్​తో ముచ్చటిస్తుంటాడు. ఆన్​లైన్​లోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటాడు. అలా రీసెంట్​గా ఫ్యాన్స్​తో ముచ్చటించిన వెంకటేశ్ ప్రసాద్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం' గురించి మాట్లాడాడు. మరి అతడు ఏమన్నాడంటే?

వెంకటేశ్ ప్రసాద్ తాజాగా ట్విట్టర్​లో 'ప్రస్తుతం ఎయిర్ పోర్ట్​లో ఖాళీగా ఉన్నా. ఎవరైనా కాసేపు ఏమైనా అడగాలంటే అడగండి '#AskVenky'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే '#AskVenky' అని ఉండడంతో ఓ నెటిజన్ అతడిని హీరో వెంకటేశ్ అని భావించినట్లున్నాడు! 'సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం సాధించినందుకు మీకు అభినందనలు సర్, మీ నుంచి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నా' అని రాస్తూ, వెంకటేశ్ ప్రసాద్​ అకౌంట్​కు ట్యాగ్ చేశాడు.

దీనికి వెంకటేశ్ ప్రసాద్ స్పందించాడు. 'రఘు, నేను ఆ వెంకటేశ్​ కాదు. కానీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి నేను కూడా బాగానే విన్నాను' అని రిప్లై ఇచ్చాడు. దీనికి ఫన్నీ ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. 'తెలుగోళ్లా మజాకా' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఇదే సెషన్​లో వెంకటేశ్ ప్రసాద్​కు నెటిజన్ల నుంచి ఎదురైన కొన్ని ప్రశ్నలు, ఆయన సమాధానాలు ఇవే

  • ప్ర : ఛాంపియన్స్​ ట్రోఫీకి ప్రకటించిన భారత్ జట్టు ఎలా ఉంది
  • జ : జట్టు బాగుంది. ఇది చిన్న టోర్నీ. మనోళ్లు బాగా ఆడతారని ఆశిస్తున్నా
  • ప్ర : సచిన్, విరాట్, లారాలో ఎవరు గ్రేట్ బ్యాటర్
  • జ : సచిన్
  • ప్ర : నచ్చిన ఫుడ్
  • జ : బీసీబిల్లాబాత్ (BisiBeleBath)
  • ప్ర : ఆల్​టైమ్ టీమ్ఇండియా గ్రేటెస్ట్ ప్లేయర్
  • జ : కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీలో జజారియా, వెంకటేష్ ప్రసాద్

'కోహ్లీ జట్టుకు భారంగా మారాడు.. పేరును చూసి టీమ్​లోకి తీసుకోవద్దు'

ABOUT THE AUTHOR

...view details