తెలంగాణ

telangana

దులీప్‌ ట్రోఫీ ప్లేయర్‌ల ఆదాయమెంత?- బీసీసీఐ ఎంత చెల్లిస్తుందంటే? - Duleep Trophy Players Salary

By ETV Bharat Sports Team

Published : Sep 10, 2024, 10:19 PM IST

Updated : Sep 10, 2024, 10:30 PM IST

Duleep Trophy Players Salary : 2024 దులీప్‌ ట్రోఫీలో చాలా మంది భారత ప్లేయర్‌లు పాల్గొంటున్నారు. భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దులీప్‌ ట్రోఫీ ప్రైజ్​ మనీ, ఆటగాళ్ల ఆదాయం, ఇతర ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

source Getty Images
Duleep Trophy (source Getty Images)

Duleep Trophy Players Salary : ప్రస్తుతం 2024 దులీప్‌ ట్రోఫీ కొనసాగుతోంది. ఇందులో ఇండియా ఏ, బీ, సీ, డీ జట్లు తలపడుతున్నాయి. భారత డొమెస్టిక్‌ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీ ఒక ముఖ్యమైన భాగం. జాతీయ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కూడా ఆడుతున్నారు. అయితే దులీప్‌ ట్రోఫీ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశం మాత్రమే కాదు, ప్రైజ్ మనీ రివార్డులను కూడా అందిస్తుంది. ఈ టోర్నీ ద్వారా ఆటగాళ్లు ఎంత సంపాదించే అవకాశం ఉందో? ఇప్పుడు తెలుసుకుందాం.

  • ప్రైజ్ మనీ, జట్టు ఆదాయం (Duleep Trophy Prize Money)
    బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దులీప్ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌ల ప్రైజ్ మనీని పెంచి, ఆటగాళ్లను సుదీర్ఘమైన ఫార్మాట్‌లలో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది. 2024 సీజన్‌లో దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు రూ.కోటి రూపాయల భారీ బహుమతిని అందుకోనుంది. ఈ బహుమతిని జట్టు సభ్యులు అందరూ పంచుకుంటారు. విజేత జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉంటే, ప్రతి క్రీడాకారుడు రూ.6 నుంచి రూ.7 లక్షలు అందుకోవచ్చు. జట్టు ఒప్పందాలు లేదా బీసీసీఐ నిర్దిష్ట మార్గదర్శకాల ఆధారంగా ఈ మొత్తం మారవచ్చు. కెప్టెన్లు, కీలక ఆటగాళ్లు వారి నాయకత్వం, ప్రదర్శనల కారణంగా కొంచెం ఎక్కువ వాటాను పొందవచ్చు.
  • మ్యాచ్ ఫీజు(Duleep Trophy Match Fees)
    ప్రైజ్ మనీతో పాటు, ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడే ప్రతి గేమ్‌కు మ్యాచ్ ఫీజును సంపాదిస్తారు. ఆటగాళ్ళు ఒక్కో మ్యాచ్‌కు రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు సంపాదిస్తారని అంచనా. టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్ళు స్థిరమైన ఆదాయాన్ని పొందేలా, జట్టు గెలిచినా లేదా ఓడిపోయినా సంబంధం లేకుండా ఈ మొత్తం అందజేస్తారు.
  • పెర్ఫార్మెన్స్‌ బోనస్‌లు
    టోర్నీలో మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లు బోనస్‌లు పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా నిర్దిష్టమైన వివరాలు అందుబాటులో లేవు. కానీ ఇలాంటి టోర్నమెంట్‌లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, సెంచరీ లేదా ఐదు వికెట్లు తీయడం వంటి ఫీట్‌లు సాధించినప్పుడు రివార్డ్‌లను అందిస్తాయి. ఇతర క్రికెట్ టోర్నమెంట్ల ఆధారంగా, దులీప్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దాదాపు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
  • స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్‌లు
    దులీప్ ట్రోఫీలో బాగా రాణిస్తే పరోక్ష ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. టోర్నమెంట్ సమయంలో ఆకట్టుకునే ఆటగాళ్ళు స్పాన్సర్లు, బ్రాండ్ల దృష్టిని ఆకర్షించవచ్చు. వివిధ కంపెనీలతో ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదురుతాయి. ఈ డీల్‌లు ఆటగాడి పాపులారిటీ ఆధారంగా లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు.
  • సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు
    జాతీయ జట్టులోకి వెళ్లాలనుకుంటున్న ఆటగాళ్లకు దులీప్ ట్రోఫీ ఒక మంచి అవకాశం. అద్భుతంగా రాణించిన వారికి జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లభించవచ్చు. ఈ కాంట్రాక్ట్‌తో ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు, BCCIతో గ్రేడ్ A కాంట్రాక్ట్ పొందిన ఆటగాడు సంవత్సరానికి రూ.కోటికి పైగా సంపాదించవచ్చు.
Last Updated : Sep 10, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details