తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యూజిక్ కన్సర్ట్​లో 'బుమ్రా' సాంగ్- లక్ష మందితో హోరెత్తిన ఈవెంట్ - BUMRAH MUSIC CONCERT

మ్యూజిక్ కన్సర్ట్​లో బుమ్రాపై పాట- దద్దరిల్లిన ఈవెంట్

Bumrah Music Concert
Bumrah Music Concert (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 27, 2025, 10:43 AM IST

Updated : Jan 27, 2025, 11:09 AM IST

Bumrah Music Concert :టీమ్ఇండియా స్టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరుతో అహ్మ‌దాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం మార్మోగిపోయింది. రీసెంట్​గా ఈ స్టేడియంలో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్​కు బుమ్రా హాజరై సందడి చేశాడు. తన రాకతో బుమ్రా ఈ ఈవెంట్​లో జోష్ నింపాడు. అతడితో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఒక్కసారిగా స్టేడియం అంతా 'బుమ్రా', 'బుమ్రా' పేరుతో దద్దరిల్లిపోయింది. దీంతో ఈవెంట్​కు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచిన బుమ్రాపై, హాలీవుడ్ సింగర్ క్రిస్ మార్టిన్ ఓ సాంగ్ పాడాడు.

'జస్ప్రీత్, మై బ్యూటీఫుల్ బ్ర‌ద‌ర్‌. ది బెస్ట్ బౌల‌ర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్‌. వి డిడ్ నాట్​ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్​ ఆఫ్ట‌ర్ వికెట్స్' (ఇంగ్లాండ్​పై నువ్వు వికెట్ల మీద వికెట్లు పడగొడుతుంటే మేం చూడలేకపోతాం) అంటూ లిరిక్స్​తో పాట పాడాడు. ఈ సాంగ్​ను అక్కడున్న ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. వెంటనే గతంలో ఇంగ్లాండ్​పై బుమ్రా చేసిన అత్యుత్తమ ప్రదర్శనను స్టేడియంలోని బిగ్​ స్క్రీన్​లో ప్లే చేశారు. దీంతో మైదానం ఒక్కసారిగా కేరితంలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

కాగా, నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్​కు దాదాపు లక్షా 20 వేలకు పైగా ఆడియెన్స్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 21వ సెంచరీలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాజిక్ కన్సర్ట్​గా ఇది రికార్డ్ కొట్టింది

Last Updated : Jan 27, 2025, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details